ఐపీఎల్లో రాణించినట్లే ఇంటర్నేషనల్లో కూడా..
'నిజం చెప్పాలంటే.. నేను ఐపీఎల్లో బాగా రాణించి ఇండియా జట్టులోకి వచ్చాను. ఐపీఎల్ లాంటి ప్రదర్శననే ఇక్కడ కూడా అనుసరించాలనుకుంటున్నాను. నా ఇంటెంట్ ప్రకారం నేను హ్యాపీగా ఉన్నాను' అని హుడా మ్యాచ్ అనంతరం జరిగిన ప్రజెంటేషన్ కార్యక్రమంలో చెప్పాడు. ఇక ఈ సిరీస్లో అతను ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. ఇక తాను సక్సెస్ కావడానికి అతను రీజన్ పేర్కొంటూ.. 'నాకు దూకుడుగా ఆడటం ఇష్టం. అవసరమైనంత మేరకు హిట్టింగ్ చేస్తా. అలాగే ఈ మధ్య నా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు జరిగాయి. నేను కాస్త ముందే బ్యాటింగ్కు దిగుతున్నాను. కాబట్టి క్రీజులో కుదురుకోవడానికి తగినంత టైం కూడా దొరుకుతుంది.' అని హుడా పేర్కొన్నాడు. ఇక ఐర్లాండ్తో సిరీస్లో అతను రెండు మ్యాచ్లలో 151పరుగులు చేశాడు. హుడా ఈ ఏడాది ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున అద్భుతంగా ఆడాడు. అతను 15 మ్యాచ్ల్లో 136.67 స్ట్రైక్ రేట్తో 451పరుగులు చేశాడు. ఐపీఎల్లో ఆకట్టుకునే ప్రదర్శన ద్వారా హుడా భారత జట్టులోకి ఎంపికయ్యాడు.
ఉత్కంఠగా సాగిన రెండో టీ20
ఐర్లాండ్ పర్యటనలో భాగంగా మంగళవారం రాత్రి ఉత్కంఠగా సాగిన హై స్కోరింగ్ రెండో టీ20లో భారత్ 4పరుగుల తేడాతో గెలుపొందింది. ఓటమి ఖాయమనుకున్న పరిస్థితుల్లో కశ్మీర్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో భారత్ విజయాన్నందుకుంది. చిన్న బౌండరీలు కలిగిన మైదానం కావడంతో ఇరు జట్ల బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. దాంతో అభిమానులు సిక్సర్లు, ఫోర్ల వర్షంతో తడిసి ముద్దయ్యారు.
దీపక్ హుడా, సంజూ శాంసన్ రికార్డ్ భాగస్వామ్యం
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 225 పరుగుల భారీ స్కోరు సాధించింది. చేసింది. దీపక్ హుడా (57 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్లతో 104) సెంచరీతో రాణించగా.... సంజూ శాంసన్ (42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్లతో 77) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరు (రెండో వికెట్కు 176 పరుగుల) రికార్డు భాగస్వామ్యాన్ని అందించారు. అనంతరం ఐర్లాండ్ 221పరుగులు చేసి ఓటమిపాలైంది. ఆ జట్టులో ఓపెనర్లు పాల్ స్టిర్లింగ్(18 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 40), ఆండీ బాల్బిర్నీ(37 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్లతో 60)టాప్ స్కోరర్లుగా నిలిచారు. హరీ టెక్టర్(28 బంతుల్లో 5 ఫోర్లతో 39), జార్జ్ డాక్రెల్(16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 34 నాటౌట్) చివర్లో చెలరేగారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, ఉమ్రాన్ మాలిక్ తలో వికెట్ తీసారు.