పటిష్టంగా ఆసీస్..
‘మెరుగైన పేస్ దళంతో పాటు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ జట్టులో ఉండటంతో ఆసీస్ పటిష్టంగా కనిపిస్తోంది. పైగా స్వదేశంలో మ్యాచ్లు జరుగుతుండటం ఆ జట్టుకు అదనపు ప్రయోజం చేకూరనుంది. అయితే భారత జట్టులోనూ మేటి ఆటగాళ్లున్నారు. ప్రత్యర్థి పతానాన్ని శాసించే గొప్ప బౌలర్లు ఆ జట్టు సొంతం. గత పర్యటనలో వాళ్లు సత్తాచాటారు. బ్యాటింగ్లో చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానె వంటి నాణ్యమైన బ్యాట్స్మెన్ కూడా ఉండటంతో ఇరు జట్లు మధ్య పోటీ తీవ్ర స్థాయిలో ఉంటుంది' అని వకార్ అభిప్రాయపడ్డాడు.
ఆ ముగ్గురు లేకపోవడం..
టీమిండియా విరాట్ కోహ్లీ గైర్హాజరీతో పాటు రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మలు జట్టుకు దూరమవ్వడం భారత్కు ప్రతికూలాంశమని ఈ పాక్ మాజీ క్రికెటర్ చెప్పుకొచ్చాడు. ‘రోహిత్ శర్మ గొప్ప బ్యాట్స్మన్, ఇషాంత్ శర్మ తన అనుభవంతో వికెట్లు సాధించగలడు. టెస్టుల్లో వాళ్లు లేకపోవడం టీమిండియాకు లోటే. ఇక విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ముగ్గురు లేకపోవడం భారత జట్టు'' అని వకార్ అన్నాడు.
కఠినమైన నిబంధనలు..
పెటర్నిటీ లీవ్ మీద కోహ్లీ చివరి మూడు టెస్టులకు దూరమవుతున్న సంగతి తెలిసిందే. అతని సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ జనవరిలో బిడ్డకు జన్మనివ్వనుంది. ప్రసవ సమయంలో ఆమెకు అండగా ఉండేందుకు విరాట్ తొలి టెస్టు అనంతరం స్వదేశానికి తిరిగి రానున్నాడు. పూర్తి ఫిట్నెస్ సాధించని రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ కూడా తొలి రెండు టెస్టులకు దూరమవుతున్నారు. అయితే ఆస్ట్రేలియాలో కఠిన క్వారంటైన్ నిబంధనలు, గాయం నుంచి కోలుకోవడానికి కొన్ని వారాల సమయం పడుతుండటంతో వారిద్దరు చివరి టెస్టులకు కూడా అనుమానమే అని వార్తలు వస్తున్నాయి. కాగా, నవంబర్ 27 నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా సుదీర్ఘ పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. సిడ్నీ వేదికగా తొలి వన్డే శుక్రవారం జరగనుంది.
India vs Australia: ఫిలిప్ హ్యూస్ వర్దంతి నాడే ఫస్ట్ వన్డే.. నివాళులర్పించనున్న ఇరు జట్ల ఆటగాళ్లు!