సెకండ్ ఇన్నింగ్స్లో..
‘మేం తొలి ఇన్నింగ్స్లో కనబర్చిన పోరాట పటిమను సెకండ్ గేమ్లో కొనసాగించలేకపోయాం. ఇక బౌలింగ్లో కూడా సరైన ప్రదేశాల్లో బంతులు వేయలేకపోయాం. ఇవే మాపై తీవ్ర ఒత్తిడిని సృష్టించాయి. అలాగే ప్రణాళికలకు తగ్గట్టు కూడా మేం రాణించలేకపోయాం. కానీ న్యూజిలాండ్ మాత్రం తమ వ్యూహాలకు కట్టుబడి విజయాన్నందుకుంది. ఇక మా బౌలర్లలా బ్యాట్స్మెన్ రాణించలేకపోయారు. ఓవరాల్గా మా బౌలింగ్ బాగుంది. తొలి టెస్ట్లో కూడా బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. కొన్ని సార్లు బౌలింగ్ బాగున్నా పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు. ముందడుగు వేయడం తప్పా మనం చేసేదేం ఉండదు. కానీ గెలిచే అవకాశాన్ని చేజార్చుకోవడమే నిరాశను కలిగించింది.'అని కోహ్లీ తెలిపాడు.
ICC Women's T20 World Cup 2020: సెమీఫైనల్లో సౌతాఫ్రికా, ఇంగ్లండ్
టాస్ను సాకుగా చెప్పం..
ఇక తమ ఓటమికి టాస్ కూడా ఓ కారణమని అందరూ భావించవచ్చు, కానీ తాము మాత్రం దాన్ని సాకుగా చూపించాలనుకోవడం లేదని కోహ్లీ స్పష్టం చేశాడు. ‘మా ఓటమిలో టాస్ కూడా కీలక పాత్ర పోషించిందని మీరంతా భావించవచ్చు. కానీ మేం దాన్ని సాకుగా చూపించాలనుకోవడం లేదు. టాస్ మాత్రం బౌలర్లకు అదనపు ప్రయోజనాన్ని చేకూర్చింది. ఓ అంతర్జాతీయ జట్టుగా ప్రతీ మ్యాచ్లో మేం రాణించాలని మీరు అనుకోవడంలో తప్పులేదు. విదేశీ సిరీస్ల్లో రాణించాలంటే మేం కూడా అలా రాణించాల్సిందే. మా ఓటమిని అంగీకరిస్తున్నాం. ఎలాంటి సాకులు లేవు. గుణపాఠం నేర్చుకొని ముందుకు సాగడం ఇప్పుడు మా ముందున్న పని. మొత్తానికి ఈ సిరీస్లో మేం అనుకున్న విధంగా రాణించలేకపోయాం.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
న్యూజిలాండ్ అలవోకగా..
రెండో ఇన్నింగ్స్లో భారత్ నిర్ధేశించిన 132 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కివీస్ 36 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి ఛేదించింది. లాథమ్(52), బ్లండెల్(55) అర్ధసెంచరీలతో రాణించారు. విలియమ్సన్ 5 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు. భారత్ బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు పడగొట్టగా, ఉమేశ్ యాదవ్ ఒక వికెట్ తీశాడు.
అంతకు ముందు 90/6 ఓవర్నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా 124 పరుగులకు ఆలౌటైంది. హనుమ విహారి(9), రిషభ్ పంత్(4), మహ్మద్ షమీ(5), బుమ్రా(4) స్వల్ప స్కోర్లకు వెనుదిరగడంతో భారత్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. రవీంద్ర జడేజా(16) అజేయంగా నిలవగా.. పుజారా(24) టాప్ స్కోరర్గా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 4 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించగా.. సౌథీ మూడు, వాగ్నర్, గ్రాండ్ హోమ్ తలో వికెట్ తీశారు. ఇక తొలి ఇన్నింగ్స్లో భారత్ 242 పరుగులకు కుప్పకూలగా.. న్యూజిలాండ్ 235 పరుగులకు ఆలౌటైంది.