కోహ్లీకి ఇది 21వ హాఫ్ సెంచరీ
అంతర్జాతీయ టీ20ల్లో విరాట్ కోహ్లీకి ఇది 21వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఈ క్రమంలో భారత్ తరుపున అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన రోహిత్ శర్మ రికార్డుని సమం చేశాడు. ఇదే వెస్టిండిస్ సిరిస్లో ఫ్లోరిడా వేదికగా గత ఆదివారం ముగిసిన రెండో టీ20లో ఓపెనర్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ సాధించడంతో భారత్ తరుపున అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.
సుష్మాస్వరాజ్ మరణ వార్తతో తీవ్ర మనస్తాపానికి గురయ్యా: కోహ్లీ
అగ్రస్థానంలో రోహిత్ శర్మ
టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో నిలిచాడు. నాలుగు సెంచరీలతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. దీంతోపాటు రోహిత్ శర్మ 21 హాఫ్ సెంచరీలు(17 హాఫ్ సెంచరీలు+4 సెంచరీలు) సాధించాడు. ఇప్పటివరకు 96 మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ 2422 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
కోహ్లీ అత్యధిక స్కోరు 90 నాటౌట్
అంతర్జాతీయ టీ20ల్లో విరాట్ కోహ్లీ అత్యధిక స్కోరు 90 నాటౌట్. ఇక, 70 మ్యాచ్ల్లో 2369 పరుగులతో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక, న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ (76 మ్యాచ్ల్లో 2272 పరుగులు) మూడో స్థానంలో ఉన్నాడు. కాగా, మూడు టీ20ల సిరిస్ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే.
'టీ20 సిరిస్ క్లీన్ స్వీప్... ఇక మా దృష్టంతా వన్డే సిరీస్పైనే'
|
3-0తో టీ20 సిరిస్ను కైవసం చేసుకున్న భారత్
యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ (65 నాటౌట్), కెప్టెన్ విరాట్ కోహ్లీ (52) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో మంగళవారం రాత్రి జరిగిన మూడో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విండిస్ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఇంకా ఐదు బంతులు ఉండగానే ఛేదించింది. టీ20 సిరిస్ విజయానంతరం ట్రోఫీతో కూడిన ఫొటోను కోహ్లీ ట్విటర్లో అభిమానులతో పంచుకున్నాడు. "గొప్ప విజయం.. ఇక ఇప్పుడు మా దృష్టి వన్డే సిరీస్పైనే" అని కామెంట్ కూడా పెట్టాడు.