మీడియానే పెద్దది చేసింది..
2002 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో గంగూలీ జరిగిందే చిన్న వాగ్వాదమని, కానీ మీడియా చాలా సీన్ క్రియేట్ చేసిందన్నాడు. బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో లేట్ కట్ ఆడిన తాను పిచ్పై పరుగు తీసానని, దానిపై అభ్యంతరం వ్యక్తం చేసిన గంగూలీ తనతో వాగ్వాదానికి దిగాడని తెలిపాడు. రాహుల్ ద్రవిడ్ కూడా పిచ్ మీద ఉన్న ప్రమాదకర ఏరియాలో పరుగు తీయవద్దని సూచించాడని గుర్తు చేసుకున్నాడు.
2-3 అడుగులే వేసా..
‘అది 2002 చాంపియన్స్ ట్రోఫీ అనుకుంటా. శ్రీలంకలో ఆడుతున్నాం. మా జట్టు స్కోర్ 200 పరుగులున్నప్పుడు అనుకుంటా.. నేను ఓ లేట్ కట్ షాట్ ఆడి పరుగు తీసినట్టు గుర్తుంది. ఈ క్రమంలో పిచ్పై 2-3 అడుగులు వేశాను. ఇది జరిగి ఇప్పటికే 18 ఏళ్లు అయింది. నిజాయితీగా చెబుతున్నా.. నేను కేవలం 2-3 అడుగులు ముందుకు వేసాను. అందరూ చూశారు. సౌరవ్ గంగూలీ నా దగ్గరకు వచ్చి అరిచాడు.
సౌరవ్ దూకుడుగా ఉంటాడు..
అంతకు మించి అక్కడేం జరగలేదు. రాహుల్ ద్రవిడ్ ‘రస్.. పిచ్ డేంజర్ ఏరియాలో పరుగెత్తకు'అని చెప్పాడు. అది ఓ చిన్న వాగ్వాదం మాత్రమే. సౌరవ్తో ఆడుతున్నప్పుడు.. అతను దూకుడుగా ఉంటాడు. అతని సాయశక్తులా పోరాడుతాడు. మాటకు మాట బదులిస్తాడు. అలాగే అతన్ని ప్రశాంత పరచడం కూడా సులువే. అప్పుడు మా మధ్య జరిగింది వాగ్వాదమే. అంతకు మించేంలేదు. ఇదంతా ఆటలో భాగమే. క్రీడా స్పూర్తి ప్రకారం నడుచుకుందే. కానీ మీడియా దాన్ని భూతద్దంలో చూపించింది.'అని ఆర్నాల్డ్ గుర్తు చేసుకున్నాడు.
ట్రోఫీని పంచుకున్న ఇరు జట్లు..
కొలంబో వేదికగా జరిగిన నాటి చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో వర్షం అంతరాయం కలిగించడంతో టైటిల్ను శ్రీలంక, భారత్ సంయుక్తంగా పంచుకున్నాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. రస్సెల్ ఆర్నాల్డ్(56 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో ఆ జట్టును ఆదుకున్నాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్.. వర్షం అంతరాయం కలిగించే సమయానికి 8.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది. తర్వాత కూడా ఎడతెరిపి లేకుండా కురవడంతో అంపైర్లు మ్యాచ్ను నిలిపేసి.. ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు.