కెప్టెన్ అవుతానని ముందే అనుకున్నా..
అయితే తనకు ముంబై జట్టు బాధ్యతలు ఎలా వచ్చాయో రోహిత్ శర్మ తాజాగా వెల్లడించాడు. భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్తో ఇన్స్టా లైవ్ సెషన్లో మాట్లాడుతూ.. సారథ్యం విషయంలో దినేశ్ కార్తీక్తో కొంత పోటీ ఎదురైందని గుర్తు చేసుకున్నాడు. ‘అప్పటి వరకు డెక్కెన్ చార్జెస్కు ఆడిన నేను.. ముంబై జట్టులోకి రాగానే కెప్టెన్ అవుతానని ఊహించాను. అవకాశం ఎప్పుడూ వచ్చిన తనదైన మార్క్ కెప్టెన్సీ చూపించేందుకు సిద్దంగా ఉన్నా. 2013 వేలానికి ముందు హర్భజన్ సింగ్ జట్టును నడిపించలేడని సచిన్ పా నాతో అన్నాడు. అప్పడు భజ్జీపాను కెప్టెన్ ఎందుకు చేయలేదో నాకు తెలియదు.
పాంటింగ్తో పోటీ పడలేననిపించింది. అప్పుడు నాకు కెప్టెన్ అయ్యే అవకాశం ఉంటుందని భావించా. కానీ 2013 వేలంలో రికీ పాంటింగ్ తీసుకోవడంతో అతనితో కెప్టెన్సీ రేసులో పోటీపడలేనని అనిపించింది. ఆ సీజన్లో అందరికన్నా ముందే భారత్కు వచ్చిన పాంటింగ్ ఇక్కడి పరిస్థితులను అర్థం చేసుకున్నాడు. టీమ్ బాండింగ్ సెషన్ నిర్వహించాలని ఫ్రాంచైజీ అడిగాడు. ప్రతీ ఒక్కరిలో ఓ సానుకూల దృక్పథం వచ్చేలా చేశాడు. ముఖ్యంగా యువ ఆటగాళ్లలో స్పూర్తి నింపాడు.
దినేశ్ కార్తీక్ పేరు సూచించినా..
అయితే తన వ్యక్తిగత ప్రదర్శన బాలేదని సీజన్ మధ్యలో తన సారథ్య బాధ్యతలు వదులుకున్నాడు. అప్పడు కొంతమంది దినేశ్ కార్తీక్ పేరు సూచించారు. కానీ పాంటింగ్ మాత్రం నన్ను పిలిచి నువ్వు ముందుండి కెప్టెన్గా జట్టు నడిపించాలన్నాడు. అలా నేను కెప్టెన్ అయ్యా. ఆ సీజన్లో పాంటింగ్ ప్లేయర్ కమ్ కోచ్గా వ్యవహరించాడు. అతను నాకెంతో సాయం చేశాడు.'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
9 గంటలు నిద్ర పక్కా..
తాను కనీసం 9 నుంచి 10 గంటలు నిద్రపోతానని చెప్పుకొచ్చిన హిట్ మ్యాన్.. తన కూతురు సమైరా కారణంగా ఇటీవల కాస్త నిద్రపోవడం తగ్గించానని తెలిపాడు. ‘అశ్విన్ ఇది నువ్వు నమ్మవు.. కానీ నిజం. ఇన్నేళ్ల ఐపీఎల్ చరిత్రలో నేను ఒక్కసారి కూడా బ్రేక్ఫాస్ట్ టేబుల్ వద్దకు వెళ్లలేకపోయాను. టోర్నీలో మ్యాచ్లు ముగిసేసరికి అర్ధరాత్రి అవుతుంది.. ఇది ఒక కారణమైతే.. మరొక కారణం నేను కనీసం 9-10 గంటలు తప్పనిసరిగా నిద్రపోతా. కానీ.. సమైరా పుట్టిన తర్వాత తనతో కలిసే నిద్రపోతున్నా.. ఆమెతో పాటే నిద్రలేస్తున్నా. సమైరా మెళకువగా ఉన్న సమయంలో నిద్రపోవడం సాధ్యం కావడం లేదు'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
టికెట్ తీసుకోకుండా కండక్టర్కు అలా చెప్పి అడ్డంగా బుక్కయ్యా: కోహ్లీ