ఆర్సీబీ కెప్టెన్గా..
భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా యూట్యూబ్ చానెల్తో మాట్లాడిన పార్దీవ్.. కోహ్లీ, ధోనీ, రోహిత్ శర్మ కెప్టెన్సీలపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు. అయితే కోహ్లీలో భారత జట్టు కెప్టెన్గా ఉన్న దూకుడు ఆర్సీబీ తరఫున కనిపించదన్నాడు. ‘భారత కెప్టెన్గా కోహ్లీ చాలా ప్రత్యేకం. ఎందుకంటే బుమ్రా, షమీలతో పాటు నాణ్యమైన స్పిన్నర్లు ఉండటంతో ఎప్పుడూ వికెట్లు తీయడం గురించే ఆలోచిస్తాడు. కానీ ఆర్సీబీలో పరిస్థితుల తగ్గట్టు అతని దూకుడు ఉంటుంది.
పిచ్ అనుకూలించకపోతే డిఫెన్సివ్ అప్రోచ్ ఉంటుంది. ప్రత్యర్థిని 200లోపు కట్టడి చేస్తే... జట్టుకు గెలిచే అవకాశం ఉంటుంది. అదే 220-230 సమర్పించుకుంటే మాత్రం ఏం చేయలేం. అందుకే భారత జట్టు తరఫున కోహ్లీ కనబర్చే దూకుడు ఆర్సీబీలో ఉండదు'అని పార్దీవ్ చెప్పుకొచ్చాడు.
ధోనీకి అది బాగా తెలుసు..
‘ధోనీ, రోహిత్ డ్రెస్సింగ్ రూమ్ను ప్రశాంతంగా ఉంచుతారు. కానీ విరాట్ ప్రతీ ఆటగాడిని మునివేళ్లపై నిలబెట్టి ప్రోత్సహిస్తుంటాడు. ఇక ధోనీ విషయానికొస్తే.. ప్రతీ ఆటగాడి సామర్థ్యం, వారి నుంచి ఏం రాబట్టుకోవాలనే విషయాలపై మహీకి పూర్తి సమాచారం ఉంటుంది. ఆ విధంగానే వారి ప్రతిభను బయటకు తీసుకువస్తాడు. క్రికెటర్లను తమ సహజసిద్ధమైన ఆట ఆడేలా వదిలేస్తాడు. అలా వారికి మంచి వేదిక ఏర్పాటు చేసి తమ ప్రతిభ చాటుకునే అవకాశం కల్పిస్తాడు.
ఆటగాళ్లను ఉపయోగించుకునే తీరు..
అలాగే రోహిత్ కెప్టెన్గా మంచి ప్రణాళికలు రూపొందిస్తాడు. ప్రత్యర్థుల గురించి తెలిసిన సమాచారాన్ని ఎలా ఉపయోగించుకోవాలా అని ప్రయత్నిస్తాడు. ఏ ఆటగాడిని ఎలా వినియోగించుకోవాలని ఆలోచిస్తాడు. ఈ విషయంలో కొన్నేళ్లుగా మెరుగయ్యాడు. 2014 నుంచీ ఇప్పటివరకు అతడిని గమనిస్తే ఆటగాళ్లను ఎలా ఉపయోగించుకుంటున్నాడనే విషయం మీకే తెలుస్తుంది. ఈ అంశంలో ధోనీ, రోహిత్ ఎంతో బాగా వ్యవహరిస్తారు' అని పార్థివ్ వివరించాడు.