మరో 47 పరుగులు చేస్తే
ఈ మ్యాచ్లో శిఖర్ ధావన్ మరో 47 పరుగులు చేస్తే టీ20ల్లో 7000 పరుగుల మైలురాయిని అందుకుంటాడు. అంతర్జాతీయ టీ20ల్లో ధావన్ ఇప్పటివరకు 1334 పరుగులు చేయగా... ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో 4579 పరుగులు సాధించాడు. ధావన్కు ముందు కోహ్లీ, సురేశ్ రైనా, రోహిత్ శర్మలు మాత్రమే ఈ మైలురాయిని అందుకున్నారు.
ఆర్టికల్ 370 రద్దు: కశ్మీరీల హక్కులు, పీవోకేపై అఫ్రిదికి గంభీర్ గట్టి కౌంటర్
టీ20ల్లో ఏడువేల మైలురాయిని
ఈ మ్యాచ్లో గనుక ధావన్ మరో 47 పరుగులు చేస్తే టీ20ల్లో ఏడువేల మైలురాయిని అందుకున్న 15వ క్రికెటర్గా అరుదైన ఘనత సాధిస్తాడు. ఇదిలా ఉంటే, వెస్టిండిస్ పర్యటనలో ధావన్ ప్రదర్శన నిరాశపరుస్తోంది. ఫ్లోరిడా వేదికగా జరిగిన తొలి టీ20లో ఒక పరుగు మాత్రమే చేసిన ధావన్... రెండో టీ20లో 23 పరుగులు చేశాడు.
గుయానా వేదికగా మూడో టీ20
మూడో టీ20 గుయానా వేదికగా జరగనున్న నేపథ్యంలో శిఖర్ ధావన్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటాడేమో చూడాలి మరి. మూడు టీ20ల సిరిస్ అనంతరం టీమిండియా 3 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్లు ఆడనుంది. టీ20ల్లో 7000కు పైగా పరుగులు చేసిన భారత క్రికెటర్లు వీరే:
యాషెస్ సిరీస్: స్మిత్ బాగా ఆడాడు.. పునరాగమనం అద్భుతం
టీ20ల్లో 7000కు పైగా పరుగులు చేసిన భారత క్రికెటర్లు
8416: విరాట్ కోహ్లీ
8392: సురేశ్ రైనా
8291: రోహిత్ శర్మ
6953: శిఖర్ ధావన్
6621: ధోని