రోహిత్ ఇన్.. శాంసన్ ఔట్
టీ20 జట్టులో పెద్దగా మార్పులు చేయని సెలెక్టర్లు.. విశ్రాంతిలో ఉన్న రోహిత్ శర్మను జట్టులోకి తీసుకు రాగా.. కేరళ బ్యాట్స్ మన్ సంజూ శాంసన్కు ఉద్వాసన పలికారు. దాదాపు ఐదేళ్ల తర్వాత మళ్లీ శ్రీలంకతో ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన శాంసన్ రాక రాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రెండు బంతుల్లో 6 పరుగులు చేసి నిరాశపరిచాడు. దీంతో ఈ కేరళ క్రికెటర్పై సెలెక్టర్లు వేటు వేశారు. అయితే శాంసన్ను జట్టు నుంచి తప్పించడంపై అతని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేం నిర్ణయమంటూ సోషల్ మీడియా వేదికగా బీసీసీఐపై దుమ్మెత్తిపోస్తున్నారు.
న్యూజిలాండ్తో టీ20 సిరీస్.. శాంసన్పై వేటు.. భారత జట్టు ఇదే!!
ఒక్క ఇన్నింగ్స్కే తీసేస్తారా.?
ఒక్క ఇన్నింగ్స్ లో విఫలమైనంత మాత్రనా జట్టు నుంచి తప్పిస్తారా? అని అభిమానులు ఫైర్ అవుతున్నారు. ‘ సంజూ శాంసన్ పై ఎందుకు వేటు వేశారో ఎవరైనా బీసీసీఐని నిలదీయండి. ఒక్క ఇన్నింగ్స్ లో విఫలమైనంత మాత్రానా అలా ఎలా తప్పిస్తారు? మరీ 10 రన్స్ చేసిన శివమ్ దూబేను కూడా టీమ్ మేనేజ్ మెంట్ తప్పిస్తే ఏం జరిగేది?'అని ఒకరు ప్రశ్నించగా... శాంసన్ నాలుగేళ్ల నీరీక్షణ తర్వాత రెండు బంతులే అవకాశం ఇచ్చి మళ్లీ వేటు వేశారని మరొకరు కామెంట్ చేశారు.. ‘ సెలెక్షన్ కమిటీకి పెర్ఫామెన్స్ తో సంబంధం లేదు. వికెట్ కీపర్ గా వా ళ్ల మొదటి చాయిస్ పంతే. కాబట్టి శాంసన్ మరో ఐదేళ్లు నిరీక్షించాల్సిందే. 'అని ఇంకొకరు సెటైరిక్గా ట్వీట్ చేశారు.
ఆసీస్ సిరీస్ అనంతరం..
సొంతగడ్డపై ఆ్రస్టేలియాతో మూడు వన్డేల సిరీస్ ముగిసాక కోహ్లీ సేన ఈ నెలలోనే న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. కివీస్ గడ్డపై పూర్తిస్థాయిలో మూడు ఫార్మాట్లలోనూ సిరీస్లు ఆడనుంది. మొదట 24 నుంచి 5 టీ20ల సిరీస్ ఆడనుంది. గాయం నుంచి కోలుకొని శ్రీలంక సిరీస్ తో రీ ఎంట్రీ ఇచ్చిన బుమ్రా, ధావన్ కీవీస్ పొట్టి సిరీస్ కు ఎంపికయ్యారు.ఈ సిరీస్ తో రీ ఎంట్రీ ఆశించిన ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాకు మాత్రం. భంగపాటే ఎదురైంది. ముంబై వేదికగా నిర్వహించిన ఫిట్ నెస్ టెస్టులో పాండ్యా విఫలమయ్యాడు. దీంతో న్యూజిండ్ ఇండియా-ఎ పర్యటన జట్టులో చోటుకోల్పోయాడు.