|
ఆలస్యంగా ప్రారంభమైనా..
ఇక ఈ మ్యాచ్ ఆరంభమే ఆలస్యమైంది. ఉదయం నుంచి వర్షం కురవడంతో మ్యాచ్ మొదలు కాలేదు. చివరకు సరిగ్గా 3 గంటలు ఆలస్యంగా... భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు తొలి బంతి పడింది. సరిగ్గా 3 ఓవర్లు సాగగానే వర్షంతో ఆట ఆగిపోయింది. వాన తగ్గాక మళ్లీ ఆడితే 7 బంతుల తర్వాతే మళ్లీ చినుకులతో బ్రేక్ పడింది. కొంత విరామం తర్వాత మొదలైన ఆట 13.3 ఓవర్ల పాటు సాగింది. అంతా బాగుందనుకున్న సమయంలో వెలుతురులేమితో మ్యాచ్ ఆపేయాల్సి వచ్చింది. కొద్ది నిమిషాల్లోనే మరోసారి వర్షం వచ్చింది. ఆ తర్వాత వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ను అంపైర్లు నిలిపివేయక తప్పలేదు.
|
దేవుడా.. కణికరించు
ఇక పడుతూ.. లేస్తూ సాగిన ఈ మ్యాచ్పై అభిమానులు సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇంగ్లండ్ వేదికగా మ్యాచ్ ఎవడ్రా పెట్టిందని సెటైరిక్గా కామెంట్ చేస్తున్నారు. తమ ఎడిటింగ్ నైపుణ్యానికి పదును పెట్టి నవ్వులు పూయించే మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ ప్రారంభమయ్యేసరికి మేం ముసులోల్లం అయ్యేలా ఉన్నాం.. పాకిస్థాన్లా ఇంగ్లండ్లో కూడా టోర్నీలు నిర్వహించవద్దని కామెంట్ చేస్తున్నారు. దేవుడా జర కణికరించనే మీమ్స్ షేర్ చేస్తున్నారు.
|
జాతి వివక్షకు సంఘీభావం..
అమెరికా నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతికి సంతాపసూచకంగా మ్యాచ్లో తొలి బంతిని వేయడానికి ముందు ఇంగ్లండ్, వెస్టిండీస్ ఆటగాళ్లు మోకాలిపై కూర్చొని నిరసనను ప్రదర్శించారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా వీరందరూ ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్' లోగో ముద్రించి ఉన్న జెర్సీలతో బరిలోకి దిగారు. ఇటీవలే కన్నుమూసిన విండీస్ దిగ్గజ క్రికెటర్ ఎవర్టన్ వీక్స్తో పాటు ప్రపంచవ్యాప్తంగా మృతి చెందిన కరోనా బాధితుల స్మృతిలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. భుజానికి నల్ల బ్యాండ్లు ధరించారు.