అలరించడానికి బ్యాటింగ్ చేయను..
‘మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎవర్నో అలరించడం నా లక్ష్యం కాదు. జట్టును గెలిపించడమే నా గోల్. అది టీమిండియా కావొచ్చు లేదా సౌరాష్ట్ర అయినా ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో దూకుడుగా ఆడతా, మరికొన్ని సార్లు నిదానంగా ఆడుతా. నేను క్రికెట్ ప్రేమికులను,ప్రేక్షకులను చాలా గౌరవిస్తా. నేనైతే సిక్సులు కొట్టే ఆటగాడిని కాదు. అలాగే సోషల్ మీడియాకు దూరంగా ఉంటా. ఆడేటప్పుడు అసలు దాని జోలికే వెళ్లను. ఎవరినో మెప్పించడానికి నేను బ్యాటింగ్ చేయను' అని పుజారా తెలిపాడు.
ఇంగ్లండ్ క్రికెటర్కు కరోనా.. పీఎస్ఎల్ రద్దు!!
టెస్ట్ క్రికెట్ వీక్షకుల్లో మార్పు..
ఆస్ట్రేలియా పర్యటన తర్వాత టెస్టు క్రికెట్ చూసే విషయంలో మార్పు వచ్చిందని ఈ సౌరాష్ట్ర ప్లేయర్ తెలిపాడు. తాజాగా ముంబైలోని ఓ ప్రాంతంలో తాను డిన్నర్ చేస్తుండగా ఇద్దరు వృద్ధులు కలిశారని.. సునీల్ గావస్కర్, గుండప్ప విశ్వనాథ్ల తర్వాత తనకోసమే వాళ్లు టెస్టులు చూస్తున్నట్లు చెప్పారని వెల్లడించాడు.
పరిమిత ఓవర్ల క్రికెట్ కూడా ఆడుతా..
తాను దూకుడుగా ఆడలేననేది సరికాదని పుజారా తెలిపాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ కూడా ఆడగలనన్నాడు. ' పరిమిత ఓవర్లలో నా ఆటను టీవీల్లో చాలా మంది చూడరు. క్రీజులో కుదురుకోవడానికి కాస్త సమయం తీసుకుంటానన్న విషయం నాకూ తెలుసు. కానీ.. చిన్నప్పటి నుంచీ అలాగే ఆడుతూ పెరిగా' అని ఈ టెస్టు బ్యాట్స్మన్ చెప్పుకొచ్చాడు. కాగా, పుజారా.. కివీస్ పర్యటన తర్వాత రంజీట్రోఫీ ఫైనల్లో సౌరాష్ట్ర తరఫున ఆడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరే చేసినా.. ఆ జట్టు బెంగాల్పై గెలిచి విజేతగా నిలిచింది.