|
ముందే జట్టు వీడినా..
కరాచీ కింగ్స్ తరఫున బరిలోకి దిగిన అలెక్స్ హేల్స్.. కరోనా నేపథ్యంలో ముందే జట్టు వీడినా అతను కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లు పాకిస్థాన్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ రమిజ్ రాజా తెలిపారు. దీంతో పీఎస్ఎల్ బ్రాడ్కాస్టర్స్, కామెంటేటర్స్ అందరూ కరోనా టెస్ట్లు చేయించుకునేందుకు సిద్దమయ్యారనే వార్తలను కూడా అతను ధృవీకరించారు.
‘ఇదో దురదృష్టకర సందర్భం. చివరికైతే మంచి నిర్ణయమే తీసుకున్నారు. పీఎస్ఎల్ను వాయిదా వేసినట్లు వార్తలు వస్తున్నాయి. అలెక్స్ హేల్స్ కరోనా లక్షణాలతో బాధపడుతున్నాడు. అతనికి వెంటనే పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్స్ రావాల్సి ఉంది. బ్రాడ్కాస్టర్స్, కామెంటేటర్స్ము కూడా రాబోయే రెండు గంటల్లో కరోనా టెస్ట్లు చేయించుకోనున్నాం.'అని న్యూస్ 99 అనే చానెల్కు రమిజ్ రాజా తెలిపారు.
|
ప్లేయర్ ఐడెంటిని దాచిపెట్టిన పీసీబీ
ఇక పీఎస్ఎల్ వాయిదా వార్తలను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ధృవీకరించింది. ఇటీవల పాకిస్థాన్ వీడిన ఓ క్రికెటర్ కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలిపింది. అతని పేరు చెప్పుకుండా పరీక్షలకు పంపినట్లు పేర్కొంది. పీసీబీ సీఈవో వసీం ఖాన్ సైతం ప్లేయర్ ఐడెంటినీ దాచిపెట్టాడు. ‘ పీఎస్ఎల్ ఆడిన ఓ ప్లేయర్ కరోనా లక్షణాలతో బాధపడటం వాస్తవం. అతనెవరో చెప్పలేం. ఇది పూర్తిగా ప్రైవేట్ వ్యవహారం'అని తెలిపాడు.
కేవలం ఓవర్సిస్ ప్లేయర్ అనే చెప్పాం..
రమిజ్ రాజా చెప్పిన అంశాన్ని ప్రస్తావించగా..‘అయినా తాము ఆ ప్లేయర్ ఎవరో చెప్పలేం. మేం కేవలం ఓవర్సిస్ ప్లేయర్ అని మాత్రమే చెప్పాం. ప్రస్తుతం అతను పాక్లో లేడు. గడిచిన 24 గంటల్లోనే అతను కరోనా లక్షణాలతో బాధపడుతున్నాడు.'అని వసీం ఖాన్ తెలిపాడు.