ఫస్ట్ టీమ్ హైదరాబాదే..
గత ఐదు సీజన్లుగా సన్రైజర్స్ నిలకడైన ప్రదర్శన కనబర్చి ప్లే ఆఫ్స్ చేరిన విషయం తెలిసిందే. గత సీజన్ ఆరంభంలో తడబడినా.. చివర్లో చెలరేగి మూడో స్థానంలో నిలిచింది. ఇక ఈ సీజన్లో ఆ జట్టు ఫస్టాఫ్ మ్యాచ్లను చెన్నై, ఢిల్లీ వేదికగా ఆడనుంది. అయితే ఈ రెండు వేదికలు ఆరెంజ్ ఆర్మీకి కలిసొస్తాయని ఆకాశ్ చోప్రా తెలిపాడు. 'సన్రైజర్స్ హైదరాబాద్ కచ్చితంగా ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అవుతుంది.
అంతేకాకుండా ఆ జట్టు పాయింట్స్ టేబుల్లో టాప్లో లేదా సెకండ్ ప్లేస్లో ఉంటుంది. తద్వారా ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుకు నిలుస్తుంది. వారి తొలి తొమ్మిది మ్యాచ్ల్లో 6 లేదా ఏడు గెలిచే అవకాశం ఉంది. సన్రైజర్స్ ఫస్టాఫ్ మ్యాచ్ల వేదికలు వారికి కలిసి రానున్నాయి.'అని చోప్రా చెప్పుకొచ్చాడు.
2011 World Cup భారత్-పాక్ సెమీసే అసలు ఫైనల్.. ధోనీ సిక్స్తో ఊపిరి పీల్చుకున్నాం: సైమన్ టౌఫెల్
ముంబైని ఓడించే దమ్ము..
ఇక ఐపీఎల్ 2021 సీజన్లో పటిష్టమైన ముంబై ఇండియన్స్ను ఓడించే దమ్ము, సత్తా సన్రైజర్స్ హైదరాబాద్కే ఉందని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. 'ఈ సీజన్లో ముంబై ఇండియన్స్కు గట్టి సవాల్ విసిరే జట్టు ఏదైనా ఉందంటే అది సన్రైజర్స్ హైదరాబాదే. ముంబైతో ఆడే నాలుగు మ్యాచ్ల్లో కచ్చితంగా హైదరాబాద్ రెండు గెలుస్తుంది.'అని చోప్రా పేర్కొన్నాడు. ఇక సన్రైజర్స్ హైదరాబాద్తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ముంబైని ఓడించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఈ రెండు జట్లే పేపర్పై బలంగా కనిపిస్తున్నాయి.
టాప్ స్కోరర్ వార్నరే..
సన్రైజర్స్ సారథి, ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్మన్ డేవిడ్ వార్నర్ ఈ సీజన్లో కూడా రాణిస్తాడని ఆకాశ్ చోప్రా అంచనా వేశాడు. ఆరెంజ్ ఆర్మీ తరఫున ఈ ఆసీస్ స్టారే టాప్ స్కోరర్గా నిలిచే అవకాశం ఉందన్నాడు. 'సన్రైజర్స్ తరఫున డేవిడ్ వార్నరే హయ్యెస్ట్ స్కోరర్గా నిలుస్తాడు. కాకపోతే అతను మునపటిలా 150 స్ట్రైక్రేట్తో ఆడాలేడు. కొంచెం నిదానంగా ఆడే అవకాశం ఉంది. అయినప్పటికీ అతను గత సీజన్ల మాదిరే 500 నుంచి 550 పరుగులు చేయగలడు.'అని చోప్రా చెప్పుకొచ్చాడు.
పర్పుల్ క్యాప్ రషీద్దే..
ఇక సన్రైజర్స్ సెన్సేషన్ రషీద్ ఖాన్ ఈ సీజన్లోను అదరగొడుతాడని చోప్రా అంచనా వేసాడు. హయ్యెస్ట్ వికెట్ టేకర్గా నిలిచి పర్పుల్ క్యాప్ అందుకుంటాడని అభిప్రాయపడ్డాడు. స్పిన్కు అనుకూలించే చెన్నై, ఢిల్లీ వేదికలపై అతను బంతితో చెలరేగుతాడన్నాడు. 'రషీద్ ఖాన్ హయ్యెస్ట్ వికెట్ టేకర్గా నిలుస్తాడు. అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ కూడా అందుకుంటాడు.
తొలి ఐదు మ్యాచ్లు చెన్నైలో, మిగతా నాలుగు మ్యాచ్లో ఢిల్లీలో జరగనున్నాయి. ఈ రెండు వేదికలు స్పిన్కు అనుకూలంతో దాంతో అతను సులువుగా ఈ 9 మ్యాచ్ల్లో 15 వికెట్లు తీయగలడు.'అని చోప్రా విశ్లేషించాడు. ఇక భువనేశ్వర్ కుమార్ చాలా పొదుపుగా బౌలింగ్ చేస్తాడని, పవర్ప్లేలో సత్తా చాటుతాడని తెలిపాడు. సన్రైజర్స్ హైదరాబాద్ తమ ఫస్ట్ మ్యాచ్ ఏప్రిల్ 11న కోల్కతా నైట్రైడర్స్తో ఆడనుంది.
SA vs PAK: ఐపీఎల్ కోసం వన్డే సిరీస్ ఓడిన సౌతాఫ్రికా.. మండిపడుతున్న మాజీ క్రికెటర్లు!