చాంపియన్గా రైల్వేస్ టీమ్
కాగా, 48 కిలోల్లో రైల్వేస్ బాక్సర్ మంజూ రాణి 5-0తో కలైవాణి (తమిళనాడు)పై, 57 కిలోల్లో మనీషా (హరియాణా) 5-0తో వినాక్షి (హిమాచల్)పై, 66 కిలోల్లో మంజు బంబోరియా 4-1తో అనుక్షిత బోరో (అసోం)పై, 70 కిలోల్లో సనమచ చాను (మణిపూర్) 3-2తో శ్రుతి యాదవ్ (మధ్యప్రదేశ్)పై, 81 కిలోల కేటగిరిలో హరియాణా బాక్సర్ సవీటి 5-0తో అనుపమ (రైల్వేస్)పై గెలిచి బంగారు పతకాలు దక్కించుకొన్నారు. 60 కిలోల కేటగిరీలో పంజాబ్కు చెందిన సిమ్రన్ జిత్ కౌర్ 2-3తో పూనమ్ (రైల్వేస్) చేతిలో ఓటమి పాలైంది. మొత్తం 10 పతకాలు సాధించిన రైల్వేస్ బోర్డు ఓవరాల్ చాంపియన్షిప్ ట్రోఫీని సొంతం చేసుకొంది.
తిరుగులేని బాక్సర్గా నిఖత్ జరీన్..
నిఖత్ జరీన్కు ఈ ఏడాది ఎంతో కలిసొచ్చింది. 2022లో బరిలోకి దిగిన ప్రతీ టోర్నీలో, ప్రతీ బౌట్లో తెలంగాణ బాక్సర్ గెలవడం విశేషం. గాయం నుంచి కోలుకొని ఫిబ్రవరిలో ప్రతిష్టాత్మక స్టాంజు మెమోరియల్ టోర్నమెంట్లో గోల్డ్ మెడల్తో అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చింది. ఈ టోర్నీలో రెండు సార్లు బంగారు పతకం గెలిచిన భారత్ తొలి మహిళల బాక్సర్గా హిస్టరీ క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఆగస్టులో వరల్డ్ చాంపియన్షిప్లో నిఖత్ పేరు మార్మోగిపోయింది. టాప్ క్లాస్ ఆటతో ఎదురైన ప్రత్యర్థినల్లా మట్టికరిపిస్తూ వరల్డ్ చాంపియన్ అయ్యింది. ఆపై, వెయిట్ కేటగిరీ మార్చుకొని ఆగస్టులో కామన్వెల్త్ గేమ్స్లో బరిలోకి దిగిన నిఖత్ ఫామ్ కొనసాగించింది. అలవోకగా గోల్డ్ మెడల్ సొంతం చేసుకొని మరింత పేరు తెచ్చుకుంది.
అపురూపమైన సంవత్సరం..
ఈ విజయంపై నిఖత్ జరీన్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ ఏడాది అద్భుతంగా సాగిందని పేర్కొంది. 'ఇది నాకుఎంతో అపురూపమైన సంవత్సరం. వరుసగా మూడు ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నా. ఇప్పుడు ఎలైట్ విమెన్స్ నేషనల్ బాక్సింగ్లో గోల్డ్ నెగ్గి ఈ ఏడాదిని ముగిస్తున్నా. నా కోచ్లు జాన్ వార్బర్ధన్, భాస్కర్ భట్, స్పాన్సర్లు ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ లేకపోతే ఈ ఏడాదిని ఓటమి లేకుండా ముగించడం సాధ్యం అయ్యేది కాదు.'అని నిఖత్ జరీన్ చెప్పుకొచ్చింది.