డీగో ఆత్మకు శాంతి చేకూరాలి..
‘డీగో మారడోనా ఫుట్బాల్ దిగ్గజం. తన కెరీర్లో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ ఆటలో అతడు మర్చిపోలేని అనుభూతులు మిగిల్చాడు. ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లడం అందర్నీ బాధకు గురిచేస్తోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా.'అని భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ‘డీగో లాంటి దిగ్గజం మనల్ని విడిచి వెళ్లారు. ఫుట్బాల్ ఆటను అందమైన క్రీడగా మార్చిన మాంత్రికుడు. అతని సన్నిహితులకు, అభిమానులకు నా సానుభూతి తెలియజేస్తున్నా.'అని రాహుల్ గాంధీ నివాళులర్పించాడు.
క్రీడా ప్రపంచానికి పెద్ద లోటు..
‘క్రీడా ప్రపంచానికి ఇదో పెద్దలోటు. తన ఆటతో ఎన్నో మధురజ్ఞాపకాలు మిగిల్చిన మన చిన్ననాటి స్టార్ లేరని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యా. డీగో మారడోనా మీరెప్పటికీ మా మదిలో ఉంటారు.'అని సురేశ్ రైనా ట్వీట్ చేయగా.. ‘ డీగో క్రీడాలోకంలోనే అతిగొప్ప ఆటగాడనడంలో ఎటువంటి సందేహం లేదు. అతడి మరణవార్త కలచివేసింది. తన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి.'అని వీరేంద్రసెహ్వాగ్ పేర్కొన్నాడు. ‘ఫుట్బాల్ దిగ్గజాల్లో ఒకరైన డీగో మారడోనా మనల్ని విడిచి వెళ్లిపోయారు. క్రీడా ప్రపంచానికి ఇదో బాధాకరమైన సందర్భం. అతని ఆత్మీయులకు ప్రగాఢ సానుభూతి.'అని సొగసరి బ్యాట్స్మెన్ వీవీఎస్ లక్ష్మణ్ నివాళులర్పించాడు.
మీతోనే ఫుట్బాల్..
‘క్రీడా ప్రపంచానికి, ఫుట్బాల్ క్రీడకు డీగో మరణం తీరని లోటు. నేను ఫుట్బాల్ ఇష్టపడేందుకు కారణం మీరే. మీ ఆత్మకు శాంతి కలగాలి ఛాంపియన్ డీగో'అని అనిల్కుంబ్లే ట్వీట్ చేశాడు. ‘ ఈ క్రీడా ప్రపంచం మిమ్మల్ని ఎప్పటికీ కోల్పోతుంది. మీ ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నా డీగో'అని ట్విటర్ వేదికగా రవిచంద్రన్ అశ్విన్ రాసుకొచ్చాడు. ‘దిగ్గజ ఆటగాడు మారడోనా మృతిచెందారని తెలిసి చాలా బాధగా ఉంది. అతని జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాడు. తన ఆటతో మైదానంలో మధుర జ్ఞాపకాలు మిగిల్చాడు. రెస్ట్ ఇన్ పీస్ డీగో. మిమ్మల్ని కోల్పోతున్నాం.' యువరాజ్ సింగ్ ట్వీట్ చేశాడు.
‘మీరు ఆడే రోజుల్లో ఎన్నోసార్లు మాకు పట్టరాని సంతోషాల్ని ఇచ్చారు. వాటన్నిటికీ ధన్యవాదాలు. ఈ ఆటలో అత్యున్నత శిఖరాలకు చేరిన ఏకైక వ్యక్తి డీగో మారడోనా. మీ ఆత్మకు శాంతి చేకూరాలి'రవిశాస్త్రి నివాళులర్పించారు.