ఆగస్ట్ 4 నుంచి ఆరంభం
డబ్ల్యూటీసీ-2 వ్యవధి రెండేళ్లు. 2021 ఆగస్టు నుంచి 2023 జూన్ వరకు జరుగుతుంది. ఫైనల్ ఎక్కడ జరుగుతుందో ఐసీసీ ఇంకా చెప్పలేదు. ఆగస్ట్ 4 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య ప్రారంభం కాబోయే ఐదు టెస్ట్ల పటౌడీ ట్రోఫీతోనే డబ్ల్యూటీసీ-2 ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2లో ఈ సిరీస్తో పాటు డిసెంబర్లో జరగబోయే యాషెస్ సిరీస్లో మాత్రమే ఐదేసి టెస్టులు ఉండనున్నాయి. ఇక భారత్, ఆస్ట్రేలియా మధ్య 2022లో ఇండియాలో జరగబోయే సిరీస్లో మాత్రమే 4 టెస్టులు ఉన్నాయి.
అత్యధికంగా ఇంగ్లండ్ 21 టెస్టులు
డబ్ల్యూటీసీ-2 టోర్నీలో 3 టెస్టుల సిరీసులు 7, రెండు టెస్టుల సిరీసులు 13 జరగనున్నాయి. తొలి డబ్ల్యూటీసీ మాదిరిగానే ఈసారీ 9 టెస్టు జట్లు ఆరు సిరీసుల్లో తలపడతాయి. విదేశాల్లో 3, స్వదేశంలో 3 ఉంటాయి. ఎక్కువ టెస్టులతో కూడిన సిరీసులు ఆడుతున్నవి మొత్తంగా భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు మాత్రమే. మిగతా ఆరు జట్లు గరిష్ఠంగా 3 లేదా 2 మ్యాచుల సిరీసులే ఆడతాయి.
రెండో డబ్ల్యూటీసీలో అత్యధికంగా ఇంగ్లండ్ 21 టెస్టులు ఆడబోతోంది. భారత్ (19), ఆస్ట్రేలియా (18), దక్షిణాఫ్రికా (15), పాకిస్థాన్ (14), న్యూజిలాండ్ (13) టెస్టులు ఆడుతాయి. వెస్టిండీస్, శ్రీలంక కూడా పదమూడేసీ ఆడనున్నాయి. 19 టెస్టుల్లో భారత్ సొంతగడ్డపై 9, విదేశాల్లో 10 మ్యాచ్లు ఆడాల్సి ఉంది.
Tokyo Olympics 2021: ద్యుతీ చంద్కు టోక్యో ఒలింపిక్స్ బెర్త్! ఎలాగంటే?
గెలిచిన జట్టుకు 12 పాయింట్లు
కరోనా వైరస్ వల్ల డబ్ల్యూటీసీ-1కి ఆటంకాలు ఎదురయ్యాయి. కొన్ని మ్యాచులు జరగలేదు. దాంతో పాయింట్ల పద్ధతిని ఐసీసీ మార్చేసింది. గెలిచిన జట్టుకు 12 పాయింట్లు కేటాయిస్తారు. డ్రా అయితే 4, టై అయితే 6 పాయింట్లు ఇస్తారు. గతంలో టెస్టుల సంఖ్యతో సంబంధం లేకుండా సిరీస్కు 120 పాయింట్లు ఇచ్చేవారు. ఇక స్లో ఓవర్రేట్కు జరిమానా విధిస్తారు. నిర్దేశించిన సమయానికి మించి ఎన్ని ఓవర్లు వేస్తే.. అన్ని పాయింట్లు కోత విధిస్తారు. ఆడిన మ్యాచులు, గెలుపోటములు, పాయింట్ల ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తారు. వీటిని త్వరలో జరిగే ఐసీసీ సమావేశంలో ఆమోదించాల్సి ఉంది.