ఫెయిర్గా సాగాలంటే..
ఆటగాళ్లందరూ ఇతర దేశాలకు ప్రయాణిస్తూ క్వారంటైన్ పాటిస్తున్నప్పుడు మ్యాచ్ అధికారులకు వచ్చిన కష్టం ఏంటని హోల్డర్ ప్రశ్నించాడు.‘అసలు తటస్థ అంపైర్లకు అవకాశం ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటో నాకు అర్థం కావడం లేదు. జట్టుగా ఆటగాళ్లంతా ప్రయాణాలు చేస్తూ క్వారంటైన్ పాటిస్తున్నారు. అదే అంపైర్లు కూడా చేయవచ్చు. ఆటగాళ్లలాగే ప్రయాణాలు చేస్తూ క్వారంటైన్ పాటించవచ్చు.
క్లిష్ట నిర్ణయాలుంటాయి..
టెస్ట్ సిరీస్లో చాలా సందేహాస్పదకమైన నిర్ణయాలు, సవాళ్లతో కూడిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మ్యాచ్ ఫెయిర్గా సాగాలంటే ఇరు దేశాల అంపైర్లు, మ్యాచ్ రిఫరీలు ఉండటం ఉత్తమం. ఈ నిబంధనపై ఐసీసీ మరోసారి పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది.'అని హోల్డర్ అభిప్రాయపడ్డాడు. తటస్థ అంపైర్ల నిర్ణయాన్ని ఐసీసీ 26 ఏళ్ల కిందనే ప్రవేశపెట్టినప్పటికీ.. కరోనా కారణంగా ఆ నిబంధనను తాత్కలికంగా మార్చింది. ఉమ్మి వాడకుండా నిషేధం విధించింది. అలాగే స్థానిక అంపైర్లకు అనుభవం తక్కువగా ఉండటంతో నిర్ణయాల్లో తప్పులు దొర్లే అవకాశం ఉంటుందని భావించి అదనపు రివ్యూకు అవకాశం ఇచ్చింది.
విజయం లేకుండానే..
ఇక న్యూజిలాండ్ పర్యటనను విండీస్ వీరులు విజయం లేకుండానే ముగించారు. తొలుత మూడు టీ20ల సిరీస్ను 0-2తో చేజార్చుకున్న కరీబియన్లు.. తాజాగా రెండు టెస్టుల సిరీస్లోనూ క్లీన్ స్వీప్కు గురయ్యారు. 244/6 ఓవర్నైట్ స్కోర్తో సోమవారం నాలుగో రోజు ఆటను ప్రారంభించిన వెస్టిండీస్ 317 పరుగులకు ఆలౌటైంది. జాన్ క్యాంప్బెల్ (109 బంతుల్లో 68; 8 ఫోర్లు), కెప్టెన్ జేసన్ హోల్డర్ (89 బంతుల్లో 60 బ్యాటింగ్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, నీల్ వాగ్నర్ చెరో మూడు వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించగా.. టిమ్ సౌతి, కైల్ జేమీసన్ చెరో రెండు వికెట్లు తీశారు.