|
25 కిలోల అధిక బరువున్నావ్..
అయితే పంత్ మాటలకు చిర్రెత్తుకుపోయిన మాథ్యూ వేడ్ అతనికి ధీటుగా బదులిచ్చే ప్రయత్నం చేశాడు. రిషభ్ పంత్ అధిక బరువును ప్రస్తావిస్తూ మాథ్యూవేడ్ కామెంట్ చేశాడు. ‘పంత్ నువ్వు 25 కిలోలు ఓవర్ వెయిట్ ఉన్నావు. 20, 25 లేక 30 కిలోలు అయినా అధిక బరువు ఉంటావు. ఎప్పుడైన నిన్ను నీవు బిగ్ స్క్రీన్పై చూసుకున్నావా? నిన్ను స్క్రీన్లో చూస్తే ఫన్నీగా ఉంటుంది'అని ఘాటుగా కామెంట్ చేశాడు. ఇవి స్టంప్స్ మైక్లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఆసీస్ ఇన్నింగ్స్ 25 ఓవర్లో వీరి మధ్య జరిగిన ఈ సరదా సంభాషణకు సంబంధించిన వీడియోను ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ట్వీట్ చేయడంతో నెట్టింట వైరల్ అయింది.
నవ్వుతూ ఉండటంతోనే..
ఇక మ్యాచ్ అనంతరం అధికారిక బ్రాడ్ కాస్టర్ ఫాక్స్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ ఈ సరదా సంభాషణపై మాథ్యూ వేడ్ క్లారిటీ ఇచ్చాడు. తాను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పంత్ నవ్వుతూనే ఉన్నాడని, అసలు అతను ఎందుకు నవ్వుతున్నాడో తనకు అర్థం కాలేదన్నాడు. అతని నవ్వును చూసి నా బ్యాటింగ్ ఏమైనా ఫన్నీగా ఉందా? అనిపించిందన్నాడు. ‘పంత్ నవ్వుతూనే ఉన్నాడు. అతనేం మాట్లాడలేదు కానీ.. నన్ను చూసి నవ్వుతూ ఉననాడు. అసలు నవ్వొచ్చే విషయం ఏం ఉందో నాకు అర్థం కాలేదు. నా బ్యాటింగ్ చూసి నవ్వుతున్నాడా? అనిపించింది
మాథ్యూ వేడ్ ఒంటరి పోరాటం..
తమ రెండో ఇన్నింగ్స్లో భారత బౌలర్ల ధాటికి ఓవైపు వరుసగా వికెట్లు కోల్పోతుండగా.. మరోవైపు మాథ్యూవేడ్ ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. పూర్తిగా డిఫెన్సివ్ మోడ్లో ఆడిన మాథ్యూ వేడ్ 138 బంతులో 40 పరగులు చేశాడు. కానీ రవీంద్ర జడేజా అద్భుత బంతికి వికెట్లు ముందు దొరికి పోయాడు. రివ్యూకు వెళ్లినా ఫలితం లేకపోయింది. దాంతో ఆసీస్ వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమి ముంగిట నిలిచింది. కేవలం 2 పరుగుల ఆధిక్యంలోనే ఆసీస్ ఉండగా.. మిగిలిన నాలుగు వికెట్లు ఎంత త్వరగా తీస్తే భారత విజయం అంత సులువు అవుతోంది.