|
ఇంతకీ ఆ వార్త ఏంటంటే..?
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత స్ప్రింటర్ హిమదాస్ 400 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించినట్లు ఓ ఫేక్ వార్త హల్చల్ చేసింది. ఈ వార్తకు హిమదాస్కు చెందిన ఓ పాత వీడియోను ట్వీట్ చేయడంతో అంతా నిజమని నమ్మారు. ఆ ట్వీట్ చూసిన వెంటనే అందరికన్నా ముందే ఈ వార్తను ప్రజలకు చేరవెయ్యాలనే లక్ష్యంతో కొన్ని ఇంగ్లీష్ వెబ్సైట్స్ ఆతృత చూపించాయి. తెలుగు దినపత్రికకు సంబంధించిన వెబ్సైట్తో పాటు ఇంగ్లీష్ వెబ్సైట్ దిగార్డియన్ కూడా ఈ విషయంలో తప్పటడుగు వేసింది.
|
సెహ్వాగ్పై ట్రోలింగ్..
వీటిని చూసిన వీరేంద్ర సెహ్వాగ్... హిమా దాస్కు ట్విటర్ వేదికగా అభినందనలు తెలియజేశాడు...'వాట్ ఏ విన్... భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. 400 మీటర్ల ఈవెంట్లో స్వర్ణం గెలిచిన హిమాదాస్కు కంగ్రాట్స్'అంటూ ట్వీట్ చేసిన వీరేంద్ర సెహ్వాగ్, ఆ తర్వాత అసలు విషయాన్ని తెలుసుకుని... దాన్ని వెంటనే డిలీట్ చేశాడు. అయితే అప్పటికే చాలామంది సెహ్వాగ్ ట్వీట్ను స్రీన్ షాట్ తీసి ట్రోలింగ్కు దిగారు. కాసేపటికి వెయిట్ లిఫ్టింగ్లో రజతం గెలిచిన సంకేత్ మహదేవ్ సర్గార్కు సెహ్వాగ్ అభినందనలు తెలియ జేశాడు.
|
భారత్ బోణీ..
సంకేత్ పతకంతో భారత్ కామన్వెల్త్ గేమ్స్ 2022లో బోణీ కొట్టింది. 21 ఏళ్ల సంకేత్ మహదేవ్ తండ్రి ఓ పాన్ షాప్ యజమాని కావడం విశేషం. శనివారం జరిగిన పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 55 కేజీల విభాగం ఫైనల్లో 248 కేజీల బరువు ఎత్తిన సంకేత్ సర్గార్ రజత పతకం సాధించాడు. గాయం కారణంగా కేజీ బరువు తేడాలో స్వర్ణపతకాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. కామన్వెల్త్ పోటీల్లో వెయిట్లిఫ్టింగ్ పోటీల్లో భారత్కి ఇది 49వ రజతం. ఓవరాల్గా వెయిట్లిఫ్టింగ్లో 126 పతకాలు సాధించింది భారత్. షూటింగ్లో 135 పతకాలు సాధించిన భారత షూటర్లు, ఈ లిస్టులో టాప్లో ఉన్నారు.