కీరన్ పావెల్ క్రీజును చేరే అవకాశం లేక
అప్పటికే చాలా ముందుకొచ్చిన కీరన్ పావెల్ తిరిగి క్రీజును చేరే అవకాశమూ లేకపోయింది. రెప్పపాటులో జరిగిన ఈ రనౌట్కు పావెల్ ఆశ్చర్యానికి గురయ్యాడు. కోహ్లి స్టన్నింగ్ ఫీల్డింగ్తో మైదానంలోని భారత ఆటగాళ్లు, అభిమానులు సంతోషంతో సంబరాలు చేసుకున్నారు. ఇక నెటిజన్లు కోహ్లిని ఆకాశానికెత్తారు.
పేలవరీతిలో ధావన్ ఔట్: తొడగొట్టిన బౌలర్, ట్విట్టర్లో విమర్శలు
|
ఏం ఫీల్డింగ్ అన్నా.. సూపర్
‘అరే ఏం ఫీల్డింగ్ అన్నా.. సూపర్' అని ఒకరు.. బ్యాట్ ఝులిపించకుంటే.. ఫీల్డింగ్తో మైమరిపిస్తాడు దటీజ్ కోహ్లి అంటూ పొగడ్తలు వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ రనౌట్కు సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఇక ఈ సిరీస్లో వరుసగా మూడు సెంచరీలతో రికార్డు సృష్టించిన కోహ్లి ఈ మ్యాచ్లో (16) నిరాశపరిచాడు. హిట్ మ్యాన్ రోహిత్, తెలుగు తేజం అంబటి తిరుపతి రాయుడుల సెంచరీలతో భారత్ 224 పరుగుల తేడాతో భారీ విజయం సొంతం చేసుకుంది.
224 పరుగుల తేడాతో విండీస్ను చిత్తుగా
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' రోహిత్ శర్మ (162; 137 బంతుల్లో 20ఫోర్లు, 4సిక్సు), అంబటి రాయుడు (100; 81 బంతుల్లో 8ఫోర్లు, 4సిక్సు) సెంచరీలతో చెలరేగిన వేళ.. సోమవారం జరిగిన నాలుగో వన్డేలో భారత్ ఏకంగా 224 పరుగుల తేడాతో విండీస్ను చిత్తు చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 377 పరుగుల భారీ స్కోరు చేసింది. ఖలీల్ అహ్మద్ (3/13), కుల్దీప్ (3/42) ధాటికి ఛేదనలో విండీస్ 36.2 ఓవర్లలో 153 పరుగులకే కుప్పకూలింది.
పరుగులు చేయాలని మాత్రమే ఆలోచిస్తా
‘బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సెంచరీ, డబుల్ సెంచరీల గురించి ఆలోచించను. జట్టు కోసం పరుగులు చేయాలని మాత్రమే ఆలోచిస్తాను. ఈ రోజు మ్యాచ్లో డబుల్ సెంచరీ చేయొచ్చని రాయుడు చెప్పాడు. కానీ నేను బ్యాటింగ్ మీదే దృష్టి పెట్టాను. డబుల్ సెంచరీ గురించి ఆలోచించలేదు'