సెకండ్ హయ్యెస్ట్ స్కోర్..
ఇక సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్గా పునీత్ బిష్త్ (146 నాటౌట్) ఇన్నింగ్స్ నిలిచింది. 147 రన్స్తో శ్రేయస్ అయ్యర్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన మేఘాలయ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 230 పరుగులు చేసింది. అనంతరం మిజోరం నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 90 పరుగులు మాత్రమే చేసి 130 రన్స్ తేడాతో చిత్తుగా ఓడింది.
అజారుద్దీన్ సెంచరీ..
ముంబై: ముంబై జట్టుతో జరిగిన మరో మ్యాచ్లో కేరళ అద్భుత విజయాన్నందుకుంది. కేరళ బ్యాట్స్మన్ మహ్మద్ అజారుద్దీన్(54 బంతుల్లో 9 ఫోర్లు, 11 సిక్స్లతో 137 నాటౌట్) మెరుపు ప్రదర్శనతో కేరళ 8 వికెట్లతో ముంబైని చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లకు 196 పరుగులు చేయగా.. కేరళ 15.5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 201 పరుగులు సాధించింది.
ఆంధ్రాకు రెండో ఓటమి..
ముంబై: సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఆంధ్ర జట్టు ఫ్లాఫ్ షో కొనసాగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యంతో వరుసగా రెండో మ్యాచ్లోనూ ఓటమిపాలైంది. ఎలైట్ గ్రూప్-ఈలో భాగంగా బుధవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో ఆంధ్ర చిత్తయింది. తొలతు ఆంధ్ర 20 ఓవర్లలో 9 వికెట్లకు 124 పరుగులు చేసింది. కెప్టెన్ అంబటి రాయుడు (1) పూర్తిగా నిరాశపరచగా.. మిడిలార్డర్లో అశ్విన్ హెబ్బర్ (32), ఆఖర్లో పేసర్ కోడి శశికాంత్ (21) చెలరేగారు. ప్రదీప్ 3, ఇషాంత్, సిమ్రన్జిత్, లలిత్ తలో రెండు వికెట్లు తీశారు. ఛేదనలో ఢిల్లీ 17 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 128 రన్స్ చేసి గెలిచింది. కెప్టెన్ శిఖర్ ధావన్(5) విఫలమైనా, నితీశ్ రాణా(27), అనూజ్ రావత్(33), హిమ్మత్ సింగ్(32 నాటౌట్) జట్టును గెలిపించారు.
ఆఖరి టెస్ట్ కోసం హోటల్ టాయిలెట్స్ కడుగుతున్న భారత క్రికెటర్లు!