For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చమటోడ్చుతున్న సురేశ్ రైనా.. ఐపీఎల్ 2021నే టార్గెట్.. వేలంలోకి వస్తే కాసుల వర్షమే!!

Suresh Raina to play Syed Mushtaq Ali Trophy for Uttar Pradesh

హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ సీనియర్ బ్యాట్స్‌మెన్‌ సురేశ్‌ రైనా మైదానంలోనే కాకుండా జిమ్‌లోనూ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సత్తాచాటాలని అతడు పట్టుదలతో ఉన్నాడు. ఈ ఏడాది ఆగస్టు 15న రిటైర్మెంట్ ప్రకటించిన రైనా.. మైదానంలోకి అడుగుపెట్టి దాదాపు ఏడాదన్నర అవుతోంది. దాంతో మ్యాచ్ ప్రాక్టీస్ కోసం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడబోతున్నాడు. రైనా దేశవాళీ టీ20 టోర్నీలో తన సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

బ్యాటింగ్ ప్రాక్టీస్:

బ్యాటింగ్ ప్రాక్టీస్:

యువ క్రికెటర్ ప్రియమ్ గార్గ్ కెప్టెన్సీలో ఉత్తరప్రదేశ్‌ తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడనున్న సురేశ్ రైనా.. తాజాగా నెట్స్‌లో జట్టు సహచరులతో కలిసి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. గత ఏడాది నుంచి క్రికెట్‌కు దూరమైన అతడు మునపటిలా రాణించాలని జట్టు సభ్యులతో కలిసి కఠోర సాధన చేస్తున్నాడు. దీనికి సంబంధించిన చిత్రాలను ఎప్పటికప్పుడు తన సామాజిక మాధ్యమాల ఖాతాల్లో పోస్ట్‌ చేస్తున్నాడు. తాజాగా జిమ్‌లో దిగిన ఫొటోని కూడా రైనా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.

వ్యక్తిగత కారణాలతో దూరం:

వ్యక్తిగత కారణాలతో దూరం:

యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 13వ సీజన్‌కు వ్యక్తిగత కారణాలతో సురేష్ రైనా దూరంకావడంతో.. అతడు ఐపీఎల్‌లో కొనసాగుతాడా? లేదా? అని అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. కానీ దేశవాళీ క్రికెట్‌లో ఆడతాడని రైనా వెల్లడించడంతో.. ఐపీఎల్‌లో 'చిన్న తలా' ఉంటాడని సమాచారం తెలుస్తోంది. అయితే గత సీజన్‌లో రైనా గైర్హాజరీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. స్థాయికి తగ్గట్టుగా ఆ జట్టు ప్రదర్శనలు చేయలేక తొలిసారిగా ప్లేఆఫ్స్‌‌కు చేరకుండా ఇంటిబాట పట్టింది.

రైనాపై కాసుల వర్షం:

రైనాపై కాసుల వర్షం:

ఐపీఎల్ 2020 సీజన్‌ నుంచి సురేష్ రైనా అర్ధాంతరంగా తప్పుకోవడంతో.. అతనిపై చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ గుర్రుగా ఉంది. రైనాను ఐపీఎల్ 2021 సీజన్ ముంగిట వేలంలోకి వదిలిపెట్టే సూచనలు మెండుగానే ఉన్నాయి. అదే జరిగితే.. రైనా కోసం మిగిలిన ఫ్రాంఛైజీలు భారీ స్థాయిలో పోటీపడే అవకాశం ఉంది. ఐపీఎల్‌ 2021లోకి మరో రెండు జట్లని చేర్చాలని బీసీసీఐ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. అప్పుడు వచ్చే ఏడాది ఆరంభంలో మెగా వేలం జరగనుంది. దాంతో కచ్చితంగా రైనాపై కాసుల వర్షం కురిసే అవకాశం లేకపోలేదు.

India vs Australia: వైరల్ వీడియో.. ఒకరినొకరు తోసుకున్న టీమిండియా ఆటగాళ్లు!!

Story first published: Wednesday, December 16, 2020, 19:18 [IST]
Other articles published on Dec 16, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+