|
అదిరిపోయిందంతే..
అయితే రంజాన్ పర్వదినాన్ని పురుస్కరించుకొని మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, అబ్దుల్ సమద్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఎలా జరుపుకుంటున్నారనే విషయాన్ని తెలిజేసే ఉద్దేశంతో సన్రైజర్స్ ఈ ట్వీట్ చేసింది. పండుగ సందర్భంగా వారి లుక్స్ అదిరిపోయానని, భద్రంగా పండుగ జరుపుకోవాలని క్యాప్షన్గా పేర్కొంది.
ఈ ఫొటోల్లో మహ్మద్ నబీ తన పిల్లలతో ఉండగా.. రషీద్, ముజీబ్, సమద్ కొత్త బట్టల్లో జిగేల్మన్నారు. అయితే పండుగకు సంబంధించిన ఖలీల్, నదీమ్ ఫొటోలు లేకపోవడంతో సన్రైజర్స్ వారిని విస్మరించినట్లుంది. కానీ అభిమానులు మాత్రం వీరిని ఉద్దేశపూర్వకంగానే టీమ్మేనేజ్మెంట్ మరిచిపోయిందని ట్రోల్ చేస్తున్నారు.
|
ఖలీల్ కిదర్ హై..
హలో.. సన్రైజర్స్ ఖలీల్ అహ్మద్ కిదర్ హై? అతను ముసల్మాన్ కాదా? పండుగ శుభాకాంక్షలు చెప్పరా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఫన్నీ క్యాప్షన్తో మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఎలాగు ఉండడని పక్కనపెట్టేసావా? అని మరొకరు సెటైరిక్గా కామెంట్ చేశారు. షాబాజ్ నదీమ్ను కూడా పక్కనపెట్టేసారని, అతను కూడా ముసల్మాన్ క్రికెటరేనని కామెంట్ చేస్తున్నారు. సన్రైజర్స్ ట్విటర్ హ్యాండిల్ చూసేవాడికి మతిపోయిందేమోనని మరొకరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒకే ఒక్క విజయం..
ఐపీఎల్ 2021 సీజన్లో దారుణంగా విఫలమైన సన్రైజర్స్ హైదరాబాద్ ఏడు మ్యాచ్ల్లో ఒకే విజయం సాధించింది. దాంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఈ ఏడు మ్యాచ్ల్లో దాదాపు 6 మ్యాచ్లు సులువుగా విజయం సాధించేవే. కానీ మిడిలార్డర్ వైఫల్యంతో గెలుపు ముంగిట బోల్తా పడింది.
విజయ్ శంకర్, కేదార్ జాదవ్, మనీష్ పాండే, విరాట్ సింగ్ చెత్త బ్యాటింగ్తో సునాయసంగా గెలిచే మ్యాచ్ల్లో కూడా హైదరాబాద్ ఓటమిపాలైంది. టీమ్ వైఫల్యానికి తోడు మేనేజ్మెంట్ అనాలోచిత నిర్ణయాలు కూడా జట్టు కొంప ముంచాయి. టీమ్ వైఫల్యాలకు బాద్యుణ్ణి చేస్తూ వార్నర్పై వేటు వేసిన టీమ్మేనేజ్మెంట్ కేన్ విలియమ్సన్కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. అయినా సన్రైజర్స్ రాత మారలేదు.