గవాస్కర్ నుంచి కుంబ్లే వరకు..
ఈ క్రమంలోనే ఈ వ్యాఖ్యలపై స్పందించిన సౌరవ్ గంగూలీ దీటుగా బదులిచ్చాడు.'ఆటగాళ్ల ప్రదర్శనకు డబ్బుకు సంబంధం ఉండదు. సునీల్ గవాస్కర్ నుంచి అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్ వరకు.. అప్పుడు ఆ ఆటగాళ్లు అందుకున్న మొత్తం ఇప్పడు క్రికెటర్లకు లభిస్తున్న దాంతో పోలిస్తే దరిదాపుల్లో కూడా లేదు. కానీ వాళ్లందరికీ అప్పుడు పరుగులు చేయాలనే ఆకలి ఉండేది. ఆటగాళ్లు కేవలం డబ్బు కోసమే ఆడతారని అనుకోను. ఆట వల్ల పొందే హోదా, దేశం తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నామనే గౌరవం కోసం ఆడతారు. పెద్ద అంతర్జాతీయ టోర్నీలను గెలవాలని ప్రతి ఒక్క ఆటగాడు అనుకుంటాడు'' అని దాదా చెప్పాడు.
రెండేళ్ల క్రితమే ప్లాన్..
ఐపీఎల్ ప్రసార హక్కులకు భారీ మొత్తం లభించడంపై స్పందిస్తూ.. ''ప్రసార హక్కుల అమ్మకం కోసం రెండేళ్ల క్రితమే ప్రణాళిక మొదలైంది. నిశితంగా పరిశీలించి దీన్ని తయారు చేశాం. ఈ ఏడాది భారత క్రికెట్కు ఎంతో గొప్పది. దేశవాళీ సీజన్ను ముగించబోతున్నాం. అభిమానుల సమక్షంలో ఐపీఎల్ 2022 సీజన్ ఘనంగా నిర్వహించాం. ఇప్పుడీ ప్రసార హక్కుల కోసం మెగా ఒప్పందం కుదిరింది.
74 మ్యాచ్లే..
అందులో భాగమైన డిస్నీ స్టార్, వయాకామ్18, టైమ్స్ ఇంటర్నెట్కు అభినందనలు. ద్వైపాక్షిక సిరీస్లతో ఇతర దేశాలకు ఆదాయం వస్తుంది కాబట్టి వచ్చే రెండేళ్లు ఐపీఎల్లో 74 మ్యాచ్ల చొప్పునే నిర్వహిస్తాం. ఆ తర్వాత భవిష్యత్ పర్యటన ప్రణాళికపై దృష్టి సారించాలి'' అని గంగూలీ పేర్కొన్నాడు.