అంపైర్స్ కాల్ అంటే..
రివ్యూలో బంతి వికెట్లకు తాకితే బ్యాట్స్మన్ను ఔటివ్వాలన్నాడు. ఇక క్లిష్టమైన ఎల్బీడబ్ల్యూ నిర్ణయాల్లో అంపైర్లకు ఐసీసీ ఈ డీఆర్ఎస్ విషయంలో కొంత వెసులుబాటు కల్పించింది. బంతి 50 శాతం వికెట్లను హిట్ చేయగలిగితే ఔటివ్వాలని, అంతకు తక్కువగా ఉంటే అంపైర్ తీసుకునే నిర్ణయం(అంపైర్స్ కాల్) ఫైనలనే నిబంధన పెట్టింది. అంటే 50 శాతం కంటే తక్కవగా బంతి వికెట్లను తాకితే అంపైర్ ఔటిస్తే ఔట్ లేకుంటే లేదు. దీన్నే అంపైర్స్ కాల్ అంటారు.
వికెట్లకు తాకితే..
అయితే సచిన్ మాత్రం బంతి వికెట్లకు తాకితే ఔటివ్వాల్సిందేనంటున్నాడు. లారాతో చర్చించిన వీడియోను తన అధికారిక ట్విటర్లో షేర్ చేశాడు.‘ఇక్కడ బంతి ఎంత శాతం వికెట్లను తాకిందనేది అనవసరం. రివ్యూలో బంతి వికెట్లు తాకితే ఫీల్డ్ అంపైర్ నిర్ణయంతో సంబంధం లేకుండా ఔటివ్వాల్సిందే. క్రికెట్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వెనుక ఉన్న ఉద్దేశ్యమే ఇది. అయితే టెక్నాలజే 100 శాతం సరైనదని చెప్పలేం. కానీ మానవులతో పోలిస్తే కొంచెం బెటరే'అని సచిన్ చెప్పుకొచ్చాడు.
|
100 శాతం కరెక్ట్
ఇక సచిన్ సూచించిన ప్రతిపాదనతో భారత వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఏకీభవించాడు. సచిన్ చెప్పింది 100 శాతం సరైనది ట్విటర్ వేదికగా వెల్లడించాడు. ‘పాజీ మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నా. మీరు చెప్పింది 100 శాతం కరెక్ట్. బంతి వికెట్లను తాకినా.. ముద్దాడినా ఔట్ ఇవ్వాల్సిందే. ఇక్కడ బంతి ఎంత శాతం తాకిందనేది అనవసరం. మెరుగైన ఆటకోసం కొన్ని నిబంధనలు మార్చాలి. అందులో ఇదొకటి'అని భజ్జీ ట్వీట్ చేశాడు.
అంపైర్లపై విమర్శలు..
ఇక డీఆర్ఎస్ పుణ్యమా అంపైర్ల ఘోర తప్పిదాలు బయటపడ్తున్నాయి. ఇక కరోనా నేపథ్యంలో స్థానిక అంపైర్లను ఉపయోగించుకోవాలని ఐసీసీ కల్పించిన వెసులుబాటు కొత్త తలనొప్పులను తీసుకొస్తుంది. ప్రస్తుతం ఇంగ్లండ్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్లో అంపైర్ల ఘోర తప్పిదాలు తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇద్దరు అంపైర్లు రెండు రోజుల్లోనే ఐదు తప్పిదాలు చేయడం.. అవి కూడా ఆతిథ్య జట్టుకు అనుకూలంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.