ఆదిలోనే షాక్..
అంతకుముందు 222 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. పరుగుల ఖాతా తెరవకుండానే బెన్ స్టోక్స్(0) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్ ఫోర్తో ఖాతా తెరవగా.. మరో ఓపెనర్ మనన్ ఓహ్రా సిక్స్తో దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ ఆర్ష్ దీప్ సింగ్ బౌలింగ్లో మనన్ వోహ్రా(12) రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన జోస్ బట్లర్, శాంసన్ ధాటిగా ఆడుతూ రన్ రేట్ తగ్గకుండా చూసుకున్నారు. దాంతో పవర్ ప్లేలో రాజస్థాన్ 2 వికెట్లు కోల్పోయి 59 రన్స్ చేసింది.
చెలరేగిన శాంసన్..
అనంతరం మరింత ధాటిగా ఆడిన ఈ జోడీ.. భారీ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడింది. అయితే ప్రమాదకరంగా మారిన ఈ జోడీని జై రిచర్డ్సన్ విడదీసాడు. బట్లర్(25) క్లీన్ బౌల్డ్ చేసి 45 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. ఆ తర్వాత శివమ్ దూబే రాగా.. శాంసన్ తనదైన మార్క్ షాట్స్తో చెలరేగాడు. అయితే అతను ఇచ్చిన పలు క్యాచ్లను పంజాబ్ బౌలర్లు నేలపాలు చేసి మూల్యం చెల్లించుకున్నారు. 53 పరుగులు జోడించిన తర్వాత అర్ష్ దీప్ సింగ్ బౌలింగ్లో దూబే క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత రియాన్ పరాగ్ వచ్చిన రావడంతో సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.
శాంసన్ సెంచరీ..
మరోవైపు శాంసన్ కూడా చెలరేగడంతో స్కోర్ బోర్డు పరుగెత్తింది. అయితే దాటిగా ఆడుతున్న రియాన్ పరాగ్(11 బంతుల్లో 25)ను షమీ కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో ఐదో వికెట్కు నమోదైన 52 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. జై రిచర్డ్ సన్ వేసిన 18 ఓవర్లో 4, 6, 4 బాదిన సంజూ శాంసన్ 53 బంతుల్లో సెంచరీ పూర్త చేసుకున్నాడు. అయితే మెరిడిత్ వేసిన మరుసటి ఓవర్లో రాహుల్ తెవాటియా ఔటవ్వగా.. క్రిస్ మోరిస్తో శాంసన్ పోరాడాడు. ఆఖరి ఓవర్లో రాజస్థాన్ విజయానికి 13 రన్స్ అవసరం కాగా.. శాంసన్ ఓ సిక్స్ మాత్రం కొట్టడంతో పంజాబ్ విజయం లాంచనమైంది.