నలుగురు ఆల్రౌండర్లు..
ఓపెనర్లుగా సచిన్ టెండూల్కర్, మాథ్యూ హెడెన్ ఎంపిక చేసిన ఈ క్రికెటర్లు.. మూడు, నాలుగు స్థానాల్లో ఫాఫ్ డూప్లెసిస్, అంబటి రాయుడులను తీసుకున్నారు. వికెట్ కీపర్గా మహేంద్ర సింగ్ ధోనీని ఎంపిక చేసిన రైనా-రోహిత్.. ఆశ్చర్యకరంగా.. మొత్తం నలుగురు ఆల్రౌండర్లను తీసుకున్నారు. కీరన్ పోలార్డ్, హార్దిక్ పాండ్యా, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజాలను ఎంపికచేశారు. స్పెషలిస్ట్ బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా, హర్భజన్ సింగ్లను తీసుకున్నారు.
|
రియల్ చాంప్ను మిస్సయ్యాం..
అంతా బాగానే ఉంది. కానీ ముంబై ఇండియన్స్ ట్వీట్ చూసిన తర్వాత రోహిత్ మెదళ్లో ఓ విషయం వెలిగింది. తాము రియల్ చాంపియన్ పేరు మర్చిపోయామని గుర్తుకు వచ్చింది. వెంటనే తాము చేసిన తప్పును రోహిత్ తెలియజేశాడు.
ముంబై ఇండియన్స్ ట్వీట్కు బదులిస్తూ.. ‘మేం రియల్ చాంపియన్ను మిస్సయ్యాం. మలీ నాదే తప్పు' అంటూ ట్వీట్ చేశాడు. ఇంతకీ ఈ మలీ ఎవరనుకుంటున్నారా? గతేడాది చెన్నైతో జరిగిన టైటిల్ ఫైట్లో ఆఖరి బంతికి విజయాన్నందించిన ఆ జట్టు స్టార్ పేసర్ లసిత్ మలింగా. అవును ఈ శ్రీలంక పేసర్ను రోహిత్ ముద్దుగా మలీ అని పిలుస్తాడు.
ఇద్దరే స్పెషలిస్ట్ బౌలర్లు..
ఆల్టైమ్ టీమ్లో ఏకంగా నలుగురు ఆల్రౌండర్లను తీసుకున్న రోహిత్-రైనా ఇద్దరే స్పెషలిస్ట్ బౌలర్లను ఎంచుకున్నారు. అది కడా జస్ప్రీత్ బుమ్రా, హర్భజన్ సింగ్లను తీసుకున్నారు. కానీ తమ జట్టుకు ఎన్నో విజయాలందించిన మలింగాను మాత్రం రోహిత్ విస్మరించాడు. దీంతో తన తప్పును తెలుసుకున్న హిట్ మ్యాన్ ఇదే విషయాన్ని క్రికెట్ ప్రపంచానికి తెలియజేశాడు.
చెన్నై-ముంబై ఆల్టైమ్ టీమ్..
మాథ్యూ హెడెన్, సచిన్ టెండూల్కర్, ఫాఫ్ డూప్లెసిస్, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ (కీపర్, కెప్టెన్), కీరన్ పోలార్డ్, హార్దిక్ పాండ్యా, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, హర్భజన్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా
అప్పులు తీర్చాలంటే ఆటంబాంబు అమ్ముకోవాలి: పాకిస్థాన్ మాజీ క్రికెటర్