మహిళల క్రికెట్ ఇప్పటికే ఇద్దరూ..
మహిళల వన్డే క్రికెట్లో కూడా ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు నమోదయ్యాయి. న్యూజిలాండ్ ప్లేయర్ అమెలియ కెర్, ఆస్ట్రేలియా బ్యాటర్ బెలింద క్లార్క్ ఈ అరుదైన ఘనతనందుకున్నారు. ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్ అమెలియ కెర్ 232 నాటౌట్ పరుగులతో ఈ ఫీట్ అందుకోగా.. డెన్మార్క్పై బెలింద క్లార్క్ 229 నాటౌట్ ఈ ఫీట్ సాధించింది.
భారత్ నుంచి మంధాననే..
ఇక భారత తరఫున 2017లో దీప్తిశర్మ ఐర్లాండ్పై 188 పరుగులు చేసింది. ఇదే భారత బ్యాటర్ల తరఫున అత్యధిక స్కోర్. ఈ నేపథ్యంలో పూనమ్ యాదవ్ను ఓ యూజర్..‘ ప్రస్తుత భారత మహిళా జట్టులో వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించే సత్తా ఎవరికి ఉంది?'అని ప్రశ్నించాడు. దీనికి పూనమ్.. స్మృతి మంధానకే ఆ సత్తా ఉందని సమాధానం ఇచ్చింది.
ఫ్యాన్స్తో చిట్చాట్..
కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా టోర్నీలు రద్దవ్వడంతో క్రీడాకారులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్తో సరదాగా ఇంటరాక్ట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో పూనమ్.. ఆదివారం "#AskPY @poonam_yadav24 అంటూ ట్విటర్ వేదికగా ఫ్యాన్స్తో చిట్ చాట్ చేసింది. వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది.
చెన్నైకి ఆడుతా..
మరో యూజర్ ఏ క్రికెటర్కు బౌలింగ్ చేయడం కష్టంగా ఫీలవుతారనడగగా.. న్యూజిలాండ్ బ్యాటర్ సోఫి డివైన్ అని తెలిపింది.
ఐపీఎల్లో ఏ జట్టుకు ఆడాలనుకుంటున్నావని ట్విటర్లో అభిమాని అడిగిన ప్రశ్నకు.. ‘అవకాశం దక్కితే చెన్నై తరఫున బౌలింగ్ చేయాలనుకుంటున్నా' అని పూనమ్ సమాధానమిచ్చింది.