లండన్: ఇంగ్లండ్లోని ఒవల్ క్రికెట్ మైదానాన్ని మంచు కప్పేసింది. మంచు దుప్పటిలో ఒవల్ మైదానం నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈ పకృతి సోయగం అందర్నీ కనువిందు చేస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్లకు వేదికైన ఓవల్ మైదానం ఇలా మంచు దుప్పటిలో సేద తీరుతుండటంపై అభిమానులు సరాదాగా స్పందిస్తున్నారు. ఓవల్ మైదానం హిమాలయాలను తలపిస్తుందని, అసలు ఇది క్రికెట్ గ్రౌండ్ ఎవ్వరూ అనరని కామెంట్ చేస్తున్నారు.
Snow in the Oval cricket ground. pic.twitter.com/wLXZU8LMgL
— Johns. (@CricCrazyJohns) December 12, 2022
ప్రస్తుతం పాకిస్థాన్ పర్యటనలో ఉన్న ఇంగ్లండ్.. మూడు టెస్ట్ల సిరీస్ను 2-0తో మరో మ్యాచ్ మిగిలుండగానే గెలుచుకుంది. దాంతో 22 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచిన జట్టుగా స్టోక్స్ సేన గుర్తింపు పొందింది. సోమవారం ముగిసిన రెండో టెస్ట్లో ఇంగ్లండ్ 26 పరుగుల తేడాతో పాకిస్థాన్పై గెలుపొందింది.
Oval Cricket Ground covered with snow. Beautiful.pic.twitter.com/lhfojoxcfR
— Cricket Master (@Master__Cricket) December 12, 2022
క్రిస్మస్కు ముందే యూకేలో వాతావరణం చల్లగా మారింది. ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తుండటంతో మైదానాలు, రోడ్లన్నీ మంచు దుప్పటిలో సేద తీరుతున్నాయి. ముఖ్యంగా సోమవారం మంచు వర్షం తీవ్రత ఎక్కువగా ఉండటంతో విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లను మూసివేసారు. రోడ్లపైకి ఎవరూ రావద్దని కూడా హెచ్చరించారు. ఈ మంచు వర్షం కారణంగా ముగ్గురు చిన్నారులు మరణించారని బ్రిటన్ మీడియా పేర్కొంది. లండన్లోని వాతావరణం -15 డిగ్రీ సెల్సియస్కు పడిపోయింది. ఈ ఏడాదిలో అత్యంత చల్లని రాత్రి ఇదేనని అక్కడి వాతావరణ శాఖ ప్రకటించింది.