ఎవరి స్టైల్ వారిదే..
‘కెప్టెన్సీలో ఈ ముగ్గురిదీ ఒక్కో శైలి. సారథ్య విషయంలో ఈ ముగ్గురు ఎవరికీ వారే ప్రత్యేకం. ధోనీ ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. అతడి మదిలో ఎలాంటి ఆలోచనలు ఉంటాయో, వాటిని ఎప్పుడు ఎలా అమలు చేస్తాడో పసిగట్టలేం. విరాట్ చాలా స్పష్టతతో ఉంటాడు. తనకు ఏం కావాలో బాగా తెలుసు. ఇకపోతే రోహిత్ శర్మ.. సహచరుల పట్ల ఎంతో ఉదారంగా వ్యవహరిస్తాడు. ఎదుటివారి స్థానంలో ఉండి ఆలోచిస్తాడు.'అని చెప్పుకొచ్చాడు.
ధోనీ భవితవ్యంపై..
ఇక ధోనీ భవితవ్యంపై మాట్లాడుతూ.. ఆట నుంచి ఇప్పుడే తప్పుకోవద్దని తాము ధోనీతో చర్చించామని, ఆలోపు యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ను సిద్దం చేసుకోవాలనుకున్నామని తెలిపాడు. ‘కొన్నాళ్లు ఆటకు విరామం ప్రకటించాలనుకున్న ధోనీతో మేం చర్చంచాం. ఈ సమయంలో రిషభ్ పంత్ను సిద్దం చేసుకోవాలని భావించి అతనికి అవకాశాలు ఇచ్చాం. ఇప్పుడు మహీ స్థానంలో కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. న్యూజిలాండ్ గడ్డపై సత్తాచాటాడు. అయితే ఐపీఎల్ జరిగితే మహీ సత్తా తెలిసేది. కానీ ప్రస్తుత పరిస్థితులు మరి సంక్లిష్టంగా మారాయి.'అని ఎమ్కెస్కే అభిప్రాయపడ్డాడు.
అందుకే రైనాను ఎంపిక చేయలేదు..
సురేష్ రైనాను భారత జట్టుకు ఎంపిక చేయకపోవడానికి అతని పేలవ ఫామ్ కారణమని ఎమ్మెస్కే తెలిపాడు. 2018-19 దేశవాళీ సీజన్లో అతడు పెద్దగా పరుగులు సాధించలేదన్నాడు. 'జాతీయ జట్టుకు దూరమైన తర్వాత సురేష్ రైనా దేశవాళీల్లో ఏమంత గొప్ప ప్రదర్శన చేయలేదు. 2018-19 రంజీ సీజన్లో అతడి ఆట పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అలాగే ఐపీఎల్లోనూ అతడి బ్యాట్ నుంచి మునుపటి మెరుపులు కనిపించలేదు. ఇతర యువకులు దేశీయ క్రికెట్, ఇండియా-ఎలో అద్భుత ప్రదర్శనలు చేసారు. భారత జట్టులో చోటు దక్కించుకున్నారు' అని ఎమ్మెస్కే పేర్కొన్నాడు.
ధోనీ, కోహ్లీ వెన్నుపోటు పొడిచారు.. యూవీ తండ్రి సంచలన వ్యాఖ్యలు!