రూ.10 కోట్లు ఇస్తానన్నా...
లీగ్ నిబంధనలకు విరుద్దంగా రిటెన్షన్ ప్రక్రియ ముగియకముందే లక్నో ఫ్రాంచైజీ ఆటలతో గాళ్లతో సంప్రదింపులు జరిపిందని, భారీ డబ్బును ఆశచూపి ప్రలోభాలకు గురించేసిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మేరకు ఆ ఫ్రాంచైజీపై ఇతర ఫ్రాంచైజీలు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి ఫిర్యాదు చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి.
అయితే తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ను కూడా లక్నో ఫ్రాంచైజీ ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేసిందని వార్తలు వస్తున్నారు. అతనికి రూ.10 కోట్లు ఆఫర్ చేసిందని, కానీ సిరాజ్ మాత్రం ఆర్సీబీ జట్టుకు ఆడేందుకే ఇష్టపడ్డాని తెలుస్తోంది.
సిరాజ్ సూపర్ అంటూ..
తనకు పేరుతో పాటు మంచి భవిష్యత్తు ఇచ్చిన ఆర్సీబీపై సిరాజ్ విశ్వాసం కనబర్చాడని ప్రచారం జరుగుతోంది. ఆర్సీబీ అభిమానులు, నెటిజన్లు సిరాజ్పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇక ఈ హైదరాబాద్ పేసర్ను మూడో స్లాబ్ ప్లేయర్గా ఆర్సీబీ రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. దాంతో అతనికి రూ. 7 కోట్ల కాంట్రాక్టు దక్కింది.
అయితే డబ్బులకు ఆశపడకుండా ఆర్సీబీ టీమ్లోని ఉండి సిరాజ్ మంచి పని చేశాడని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఆర్సీబీ ఫ్రాంచైజీకి ఉన్న ఫ్యాన్స్ బేస్ నేపథ్యంలో .. ఈ జట్టుకు ఆడటమే సిరాజ్ భవిష్యత్తుకు మంచిదంటున్నారు. ఆర్సీబీకి ఆడటం వల్లనే సిరాజ్.. టీమిండియాకు ఆడుతున్నాడనే విషయాన్ని అందరూ గ్రహించాలంటున్నారు. పైగా కెప్టెన్ కోహ్లీతో ఏర్పడిన సాన్నిహిత్యం కూడా అతని కెరీర్కు మంచిచేస్తుందని చెబుతున్నారు.
కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్..
ఇక లక్నో ఫ్రాంచైజీ ఇప్పటికే కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్లతో ఒప్పందం కుదర్చుకుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. రాహుల్కు అత్యధికంగా రూ.20 కోట్లు చెల్లించేందుకు ఆ ఫ్రాంచైజీ సిద్దపడిందని, రషీద్ ఖాన్కు రూ. 14 కోట్ల ఆఫర్ ఇచ్చిందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు ఆటగాళ్లు తమ పాత ఫ్రాంచైజీలను వదిలేసారని ప్రచారం జరుగుతుంది.
దీనిపై ఆయా ఫ్రాంచైజీలు బీసీసీఐకి ఫిర్యాదు చేశాయని, ఈ ఆరోపణలు నిజమైతే ఈ ఇద్దరి ఆటగాళ్లపై నిషేధం పడే అవకాశం ఉంది. గతంలో రవీంద్ర జడేజా సైతం ఇలానే ఇతర ఫ్రాంచైజీలతో సంప్రదింపులు చేసి వేటుకు గురయ్యాడు.
ఆర్సీబీ రిటెన్షన్ లిస్ట్..
1. విరాట్ కోహ్లీ రూ. 15 కోట్లు
2. మ్యాక్స్వెల్ రూ. 12 కోట్లు
3. మహమ్మద్ సిరాజ్ రూ. 7 కోట్లు
ఖర్చు చేసింది రూ.33 కోట్లు; మిగిలింది రూ.57 కోట్లు.