నిరాశ చెందా:
'కింగ్స్ ఎలెవన్ ఫ్రాంచైజీతో నా ప్రయాణాన్ని పూర్తిగా ఆనందించాను. ఈ సీజన్ కోసం నాకు బాధ్యతలు అప్పగించిన పంజాబ్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతున్నా' అని హెస్సన్ గురువారం ట్వీట్ చేశాడు. 'ఈ సీజన్ బాగా సాగలేదు. కింగ్స్ పంజాబ్ నిరూత్సాహ పరచడంతో కొంత నిరాశ చెందా. అయితే విజయానికి వారు చాల దగ్గరగా ఉన్నారని నేను ఖచ్చితంగా చెప్పగలను. భవిష్యత్తులో పంజాబ్ బాగా రాణించాలని కోరుకుంటున్నా. పంజాబ్ జట్టుకు శుభాకాంక్షలు' అని హెస్సన్ రాసుకొచ్చాడు.
|
టీమిండియా కోచ్ పదవికి దరఖాస్తు:
టీమిండియా ప్రధాన కోచ్ పదవికి మైక్ హెస్సెన్ దరఖాస్తు చేసుకున్నాడు. టామ్ మూడీ, గ్యారీ కిరెస్టన్లతో పాటు హెస్సెన్ రేసులో ఉన్నాడు. అయితే ప్రస్తుత కోచ్ రవిశాస్త్రికే మళ్లీ ఈ పదవి దక్కే అవకాశం ఉంది. కపిల్ కమిటీ కూడా స్వదేశీ కోచ్కే మొగ్గు చూపుతున్నారు. మరోవైపు పాకిస్తాన్ ప్రధాన కోచ్ పదవి నుంచి మికీ ఆర్థర్ను తప్పించడంతో ఆ జట్టు కొత్త కోచ్ కోసం దరఖాస్తులు ఆహ్వానించనుంది. దాంతో పాకిస్తాన్ ప్రధాన కోచ్ పదవికి సైతం హెస్సన్ దరఖాస్తు చేసే అవకాశాలున్నాయి. టీమిండియా, పాకిస్తాన్ కోచ్లలో ఏదైనా ఒకటి దక్కుతుందనే.. ముందుగా పంజాబ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
న్యూజిలాండ్ కోచ్గా ఆరేండ్లు:
న్యూజిలాండ్ క్రికెట్ హెడ్ కోచ్ పదవికి హెస్సన్ గతేడాది వీడ్కోలు పలికాడు. కుటుంబ కారణాలతో కోచ్ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. కుటుంబంతో మరింత సమయం గడుపాలనుకుంటున్నాను అని హెస్సన్ అప్పుడు పేర్కొన్నాడు. ఆరేండ్లుగా జట్టుకు కోచ్గా ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెటలో కివీస్ జట్టుకు గుర్తింపు తేవడంలో హెస్సన్ కీలకంగా వ్యవహరించాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్సీ బాధ్యతలు మోస్తున్నాడు. విండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్, కేఎల్ రాహుల్, నికోలస్ పూరన్, సామ్ కర్రన్ లాంటి ఆటగాళ్లు పంజాబ్ జట్టులో ఉన్నారు. బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటా పంజాబ్ జట్టుకు సహయజమాని.