For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్‌లో యాషెస్ సిరీస్ కంటే భారత్Xపాక్ పోరే గొప్పది: మాజీ క్రికెటర్లు

Michael Vaughan and Adam Gilchrist feels India vs Pakistan is the biggest game, not the Ashes
ICC T20 WorldCup 2022 Schedule, Here Is Ind vs Pak Match Date | Oneindia Telugu

లండన్: క్రికెట్‌లో యాషెస్ సిరీస్ కంటే భారత్-పాక్ పోరే గొప్పదని ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు అన్నారు. యాషెస్ సిరీస్ కంటే దాయాదీల పోరునే ఎక్కువ మందిని చూస్తారని అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌ - 2022 షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శుక్రవారం విడుదల చేసేసింది. 2021 తరహానే మరోసారి భారత్‌‌-పాక్ జట్లు ఒకే గ్రూప్‌లో తలపడనున్నాయి. అంతేకాకుండా అక్టోబర్‌ 23న పాకిస్థాన్‌తో జరిగే తొలి మ్యాచ్‌తోనే టీమిండియా టీ20 ప్రపంచకప్ క్యాంపైన్ ప్రారంభించనుంది. ఈ క్రమంలో దాయాది దేశాల పోరుపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకెల్‌ వాన్, ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌, సౌతాఫ్రికా పేస్ గన్ డేల్‌ స్టెయిన్‌ స్పందించారు.

రోహిత్‌కు గట్టి సవాలే..

రోహిత్‌కు గట్టి సవాలే..

స్టార్ స్పోర్ట్స్ డిబేట్‌లో దాయాదీల పోరే ప్రతిష్టాత్మమైనదిగా అభివర్ణించారు. ముందు మైకేల్‌ వాన్‌ మాట్లాడుతూ.. ''ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లుగా యాషెస్‌ సిరీస్‌నే ప్రతిష్టాత్మక పోరుగా భావిస్తాం. అయితే అది తప్పు. భారత్ x పాకిస్థాన్‌ జట్ల మధ్య జరిగే మ్యాచే అతిపెద్ద పోరు. రోహిత్ శర్మ సారథిగా అసలైన సవాల్‌ను ఎదుర్కోనున్నాడు. అప్‌కమింగ్ వరల్డ్‌ కప్‌ టోర్నీ ప్రత్యేకంగా నిలవనుంది'' అని తెలిపాడు.

చాలా క్రేజీగా ఉంటుంది..

చాలా క్రేజీగా ఉంటుంది..

భారత్‌, పాక్‌ మధ్య మ్యాచ్‌ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని సౌతాఫ్రికా మాజీ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ అన్నాడు. 'దాయాది దేశాల మధ్య మ్యాచ్‌ అంటేనే క్రేజీగా ఉంటుంది. అందుకు మెల్‌బోర్న్ క్రికెట్‌ గ్రౌండ్‌ వేదిక కావడం ఇంకా విశేషం. ఎంసీజీ అంటే నాకెంతో ఇష్టం. 2015 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాతో ఇక్కడే తలపడ్డాం.'' అని గుర్తు చేసుకున్నాడు.

ఈసారి భారత్‌దే విజయం..

ఈసారి భారత్‌దే విజయం..

పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్‌ ఖచ్చితంగా చెలరేగుతుందని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గిల్‌క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. 'దాయాదుల మధ్య హోరాహోరీ పోరు ఉండటం ఖాయం. గత ప్రపంచకప్‌లో పది వికెట్ల తేడాతో భారత్‌పై పాక్‌ సునాయస విజయం సాధించింది. కాబట్టే ఈసారి టీమిండియా ప్రతికారంగా చెలరేగుతుందని భావిస్తున్నా'అని గిల్‌క్రిస్ట్‌ చెప్పుకొచ్చాడు.

గతేడాది చిత్తుగా..

గతేడాది చిత్తుగా..

గతేడాది దుబాయ్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా.. పాక్‌తో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత న్యూజిలాండ్ చేతిలో కూడా పరాజయం పాలై సెమీస్ చేరకుండానే ఇంటిదారి పట్టింది. టీ20 ప్రపంచకప్‌ పోటీల్లో ఇప్పటి వరకు ఆరు సార్లు తలపడగా.. భారత్‌ ఐదు సార్లు విజయం సాధించింది. అయితే ఈసారి రోహిత్‌ శర్మ నేతృత్వంలోని భారత్‌ జట్టు ప్రపంచకప్‌ బరిలోకి దిగనుంది. అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 13 వరకు ఆస్ట్రేలియా వేదికగా ఈమెగా టోర్నీ జరగనుంది.

Story first published: Friday, January 21, 2022, 19:55 [IST]
Other articles published on Jan 21, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+