ఐపీఎల్లోనే తెలుసు..
ఇషాన్ కిషన్ స్టార్ ప్లేయరని, ఇదివరకే ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున అనేకసార్లు విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడాడని జాసన్ రాయ్ గుర్తు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే రెండో టీ20లో అతను విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగినా తనకు ఆశ్చర్యం కలిగించలేదని తెలిపాడు. 'ఇషాన్ కిషన్ ఓ స్టార్ ప్లేయర్. ముంబై ఇండియన్స్ తరఫున ఎన్నో విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడాడు. అతను ఇలా ఆడుతాడని నాతో పాటు అందరికి తెలుసు. అందుకే అతని ఇన్నింగ్స్తో నేనేం ఆశ్చర్యానికి గురవ్వలేదు'అని జాసన్ రాయ్ చెప్పుకొచ్చాడు.
దూకుడే మంత్రంగా..
ఇక ఇంగ్లండ్ ఆటతీరుపై స్పందించిన రాయ్.. దూకుడుగా ఆడటమే తాము నియమంగా పెట్టుకున్నామని చెప్పాడు. అయితే, మొతేరా లాంటి పిచ్మీద ఆడేటప్పుడు మరింత కచ్చితత్వంతో ఆడాలని, పిచ్ను త్వరగా ఆర్థం చేసుకోవాలన్నాడు. కానీ ధాటిగా ఆడే క్రమంలో కొన్నిసార్లు బ్యాట్స్మెన్ విఫలమౌతారని చెప్పాడు. కానీ తమకున్న బ్యాటింగ్ లైనప్ను బట్టి టాప్ఆర్డర్ ధాటిగా ఆడే అవకాశం ఉందన్నాడు. మరోవైపు తొలి రెండు మ్యాచ్ల్లో(49, 46) నిలకడగా ఆడిన తాను ఇకపై భారీ ఇన్నింగ్స్ ఆడాలనుకుంటున్నట్లు రాయ్ చెప్పుకొచ్చాడు.
నా టార్గెట్ అతను..
ఇక సెకండ్ టీ20లో ఒకే బౌలర్ను లక్ష్యం చేసుకోని ఆడాలనుకున్నానని, కానీ అతని బౌలింగ్లోనే ఔటయ్యానని రాయ్ తెలిపాడు. 'ఒకే బౌలర్ను లక్ష్యం చేసుకొని ఆడాల్సిన పిచ్ అది. దురదృష్టంకొద్దీ నేను ఎంపిక చేసుకున్న బౌలరే నన్ను ఔట్ చేశాడు. సుందర్ను లక్ష్యంగా చేసుకొని ఆడాలనుకున్నా. కానీ, అతడే ఔట్ చేశాడు. ఆ ఓవర్లో నేను కొన్ని పరుగులు సాధించి ఉంటే అది మా బ్యాటింగ్కు మరింత దూకుడు పెంచేది' అని ఈ ఇంగ్లండ్ ఓపెనర్ పేర్కొన్నాడు. ఇక మంగళవాం జరిగే మూడో టీ20లో తమ జట్టు మరింత బలంగా పుంజుకొని ఆడుతుందని ధీమా వ్యక్తం చేశాడు.