మధ్యప్రదేశ్ను విజేతగా..
ఈ సీజన్ రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ తొలిసారి విజేతగా అవతరించడంలో కోచ్గా చంద్రకాంత్ పండిట్ కీలకపాత్ర పోషించాడు. అంతేకాదు రంజీ క్రికెట్లో అత్యంత సూపర్ సక్సెస్ కోచ్గా ఆయనకు మంచి పేరు ఉంది. ప్రస్తుత తరుణంలో హెడ్కోచ్గా చంద్రకాంత్ పండిట్ సరైనవాడని కేకేఆర్ అభిప్రాయపడుతోంది. అందుకే చంద్రకాంత్ పండిట్ను ఏరికోరి కేకేఆర్ కోచ్గా తీసుకొచ్చింది.
సంతోషంగా ఉంది..
ఇదే విషయమై కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ మాట్లాడుతూ.. 'దేశవాలీ దిగ్గజ కోచ్ చంద్రకాంత్ కేకేఆర్ ఫ్యామిలీలోకి రావడం మమ్మల్ని ఉత్సాహపరిచింది. కోచ్ పాత్రలో మా జట్టును విజయవంతంగా నడిపించాలని.. జర్నీ సాఫీగా సాగిపోవాలని కోరకుంటున్నా. ఆట పట్ల అతనికున్న అంకితభావం, నిబద్ధత.. మరెవరికి లేదు. అందుకే దేశవాళి క్రికెట్లో దిగ్గజ కోచ్గా అవతరించాడు. మా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు విలువైన సలహాలు ఇస్తూ ఐపీఎల్ టైటిల్ అందించాలి'అని కోరుతున్నా అంటూ తెలిపాడు.
భారత్ తరఫున 23 వన్డేలు..
ఇక చంద్రకాంత్ పండిట్ భారత్ తరపున 1986-92 వరకు ప్రాతినిధ్యం వహించాడు. భారత్ తరపున చంద్రకాంత్ 5 టెస్టులు, 23 వన్డేలు ఆడాడు. టీమిండియా ఆటగాడిగా అంతగా సక్సెస్ కాలేకపోయిన రంజీ కోచ్గా అందరి ప్రశంసలు అందుకున్నాడు. చంద్రకాంత్ రంజీ కోచ్గా అడుగుపెట్టాకా ముంబైని(2002-03, 2003-04,2015-16) మూడుసార్లు, విదర్భను(2017-18, 2018-19) రెండుసార్లు రంజీ చాంపియన్గా నిలపడంలో కీలకపాత్ర పోషించాడు. తాజాగా మధ్యప్రదేశ్ను తొలిసారి రంజీ విజేతగా నిలిపి చంద్రకాంత్ దిగ్గజ కోచ్గా అవతరించాడు. ఆటగాడిగా సాధించలేని రంజీ టైటిల్ను కోచ్గా మధ్యప్రదేశ్కు సాధించిపెట్టాడు.
రెండు టైటిళ్లు మాత్రమే..
ఇక గౌతమ్ గంభీర్ సారథ్యంలో 2012, 2014లో చాంపియన్గా నిలిచిన కేకేఆర్.. మరోసారి టైటిల్ సాధించలేకపోయింది. 2021లో ఇయాన్ మోర్గాన్ సారధ్యంలో ఫైనల్ చేరినప్పటికి.. సీఎస్కే చేతిలో ఓటమిపాలై రన్నరప్గా నిలిచింది. ఇక 2022 ఐపీఎల్ సీజన్లో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని కేకేఆర్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. కనీసం ప్లేఆఫ్ చేరకుండా ఏడో స్థానంతో సరిపెట్టుకుంది.