ఏదో ఒక ప్రాంఛైజీ తమను తీసుకోవాలని
ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం డిసెంబర్ 18 జైపూర్ వేదికగా జరగనుంది. కొద్ది రోజుల ముందే అంటి పెట్టుకున్న ఆటగాళ్లను మినహాయించి మిగిలిన క్రికెటర్లందరినీ విడుదల చేస్తున్నట్లు బీసీసీఐకి జాబితా పంపించేశాయి అన్ని ఫ్రాంచైజీలు. వారంతా ఈ వేలంలో ఏదో ఓ జట్టుకు సొంతమై తమ సత్తా నిరూపించుకోవాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక టీ20 లీగ్లో ఏదో ఒక ప్రాంఛైజీ తమను తీసుకోవాలని కోరుకుంటున్నారు.
|
బస్సుపైకి ఎవరి బొమ్మ రావాలి
జైపూర్ వేదికగా డిసెంబర్ 18న జరగనున్న వేలంలో 1003 మంది పేర్లు నమోదు చేసుకోగా 346 పేర్లను షార్ట్లిస్ట్ చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ సందర్భంగా ఏ ఆటగాళ్లను తీసుకోవాలని 3 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ అభిమానులను కోరింది. పేర్లు చెప్పాలంటూ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో సూచించింది. ఆటగాళ్లంతా ఉన్న బస్సు ఫొటో పోస్టు చేసి ‘బస్సుపైకి ఎవరి బొమ్మ రావాలి' అని అభిమానులను అడిగింది.
ఆస్ట్రేలియా తాను తీసిన గోతిలో తానే పడనుందట!!
|
చాలామంది టీమిండియా సిక్సర్ల హీరో యువరాజ్
అభిమానుల్లో చాలామంది టీమిండియా సిక్సర్ల హీరో యువరాజ్ సింగ్ను తీసుకోవాలని సూచిస్తున్నారు. ఒకరైతే షాన్మార్ష్/యువరాజ్/ముష్ఫికర్/మహ్మదుల్లా పేర్లతో జాబితా ఇచ్చారు. గతేడాది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఆడిన యువీ ఫామ్ను రాబట్టుకోలేకపోయాడు. దీంతో ఆశించిన మేర ప్రదర్శన చేయలేకపోవడంతో ప్రస్తుతం అతణ్ని పంజాబ్ విడుదల చేసేసింది. ప్రస్తుతం యువీ.. రూ.2 కోట్ల నుంచి కనీస ధరను రూ.కోటికే మార్చుకున్నాడు.
|
ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఎవరో చెప్పాలంటూ
కోల్కతా నైట్రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ ప్రాంఛైజీలు యువీని తీసుకోవాలని అభిమానులు కోరుతున్నారు. ఇప్పటికైతే కోల్కతా నైట్రైడర్స్లో మిడిలార్డర్లో సీనియర్ ఆటగాళ్లు ఎవరూ లేకపోవడం గమనార్హం. ఇదే తరహాలో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా జట్టులో మిగిలిన ఆటగాళ్లు ఎవరుంటే బాగుంటుందో చెప్పాలంటూ.. ట్విట్టర్లో పోస్టు చేసింది.