ఆర్సీబీ కేవలం 70 పరుగులకే ఆలౌట్
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ కేవలం 70 పరుగులకే కుప్పకూలడం... ఆ తర్వాత చెన్నై ఆ మాత్రం స్కోరును చేజ్ చేయడానికి కూడా శ్రమించడం అభిమానులకు ఎంతమాత్రం నచ్చలేదు. అటు చెన్నై కెప్టెన్ ధోనీ కూడా తన హోమ్ గ్రౌండ్ పిచ్పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. పిచ్ చాలా చాలా మెరుగ్గా ఉండాలని అభిప్రాయపడ్డాడు.
ఇలాంటి పిచ్పై ఆడటం కష్టమే
ఇలాంటి పిచ్పై తమ టీమ్ ఆడటం కూడా కష్టమేనని మ్యాచ్ అనంతరం ధోని వెల్లడించాడు. "ఇలాంటి పిచ్ను అస్సలు ఊహించలేదు. 2011 చాంపియన్స్ లీగ్ పిచ్ గుర్తుకొచ్చింది. గతేడాది ఈ పిచ్ బాగానే ఉంది. కానీ సడెన్గా ఇలాంటి పిచ్ ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. ఇది ఇలాగే ఉంటే మాకు కూడా కష్టమే. దీనిని మెరుగు పరచాల్సిన అవసరం కచ్చితంగా ఉంది" అని అన్నాడు.
స్పిన్కు ఇంతగా అనుకూలించడం అసాధారణం
"మంచు పడుతున్నా కూడా స్పిన్కు ఇంతగా అనుకూలించడం అసాధారణం. కనీసం 140 స్కోరయినా అయితేనే బాగుంటుంది. 80, 90, 100, 120 చాలా తక్కువ స్కోర్లు. ఇదే పిచ్పై ప్రాక్టీస్ మ్యాచ్ ఆడినా.. దీని తీవ్రత అప్పుడు తెలియలేదు. తమ టీమ్లో మంచి హిట్టర్లు ఉన్నారని, వాళ్లు భారీ షాట్లు ఆడాలని అనుకుంటారు" అని ధోని చెప్పాడు.
ఇలాంటి పిచ్ అస్సలు పనికి రాదు
"టాస్ మన చేతుల్లో ఉండదు కాబట్టి.. బ్యాటింగ్కు అనుకూలించే పిచ్ అయితే మంచిది. నిలకడగా రాణించాలంటే మాత్రం ఇలాంటి పిచ్ అస్సలు పనికి రాదు" అని ధోని తెలిపాడు. చెపాక్ వేదికగా శనివారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన ఆరంభ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.