మూడో కేరళ ఆటగాడు:
ఇక విండీస్ సిరీస్కు మొదటగా అవకాశం రాలేదు. అయితే ఓపెనర్ శిఖర్ ధావన్ గాయపడటంతో శాంసన్కు భారత సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టీ20లో చోటు దక్కలేదు. ఇక రెండో మ్యాచ్ జరుగుతున్న తిరువనంతపురం శాంసన్ సొంత మైదానం. అందుకే ఈ మ్యాచులో సంజుకి అవకాశం ఇవ్వాలి ఆందోళనలు చేస్తున్నారు. టిను యోహానన్, శ్రీశాంత్ తర్వాత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మూడో కేరళ ఆటగాడు సంజు శాంసన్.
శాంసన్కు చోటివ్వరా:
'తొలి మ్యాచ్లో కేఎల్ రాహుల్ బాగా ఆడాడు. అయినా మా యువ ఆటగాడు శాంసన్ రెండో టీ20 మ్యాచులో ఆడతాడన్న నమ్మకం ఉంది.
ఎందుకంటే అతడు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలడు. వర్షసూచన ఉండటంతో 20 ఓవర్ల మ్యాచ్ జరుగుతుందా లేదా అనే సందేహముంది ' అని కొందరు స్థానిక యువకులు అంటున్నారు. పరోక్షంగా రిషబ్ పంత్ స్థానంలో చోటు ఇవ్వాలని వారు అంటున్నారు.
అరగంటలో సిద్ధం:
వర్షం పడినా స్టేడియంలో నీరు నిలవదని, అంతగా ఇబ్బందేమీ ఉండదని పిచ్ క్యూరేటర్ బిజు అంటున్నారు. 'పిచ్, మైదానం కింద 3500 పైపులు ఉన్నాయి. మైదానంలోని నీరు బయటకు వెళ్లిపోతుంది. మ్యాచ్ ఆడుతున్నప్పుడు వర్షం పడినా.. 30 నిమిషాల్లో మైదానాన్ని సిద్ధం చేయగలం' అని బిజు తెలిపారు.
8 పరుగులకే ఆలౌట్.. 9 మంది డకౌట్!!
సిరీస్పై కన్ను:
2017లో గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఏకైక టీ20లో న్యూజిలాండ్తో భారత్ తలపడింది. ఎడతెరపి లేని వర్షం కురిసినా సిబ్బంది మైదానాన్ని అరగంటలో సిద్ధం చేశారు. 8 ఓవర్లు జరిగిన ఆ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. తొలి టీ20లో తమ టీ20 చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన టీమిండియా.. సిరీస్పై కన్నేసింది. మరోవైపు భారత్ జోరుకు అడ్డుకట్ట వేసి సిరీస్లో నిలవాలని చూస్తోంది.