మరోసారి గేల్ విఫలం:
లక్ష్య ఛేదనలో వెస్టిండీస్కు ఆరంభం దక్కలేదు. ఓపెనర్ క్రిస్ గేల్ (11; 24బంతుల్లో 1×4) ఈ మ్యాచ్లోనూ తన ప్రభావం చూపలేకపోయాడు. భారత బౌలర్లను ఎదుర్కొలేక పరుగులు చేయడంలో విఫలమయ్యాడు. మరోవైపు లూయిస్ బ్యాట్ ఝళిపించాడు. గేల్ తడబడుతూ చివరకు 10వ ఓవర్లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు. అనంతరం షై హోప్ (5), హెట్మయర్ (18)లు కూడా త్వరగానే పెవిలియన్కు చేరడంతో విండీస్ కష్టాల్లో పడింది.
ఆదుకున్న లూయిస్-పూరన్:
ఈ సమయంలో పూరన్తో కలిసి లూయిస్ ఇన్నింగ్స్ను నిర్మించాడు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపారు. ఈ క్రమంలో లూయిస్ 23వ ఓవర్లో అర్ధ శతకం బాదాక.. కుల్దీప్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. తర్వాత పూరన్, ఛేజ్(18) పోరాడే ప్రయత్నం చేశారు. అయితే భువనేశ్వర్ 35వ ఓవర్లో ఇద్దరినీ వెంటవెంటనే పెవిలియన్కు పంపాడు. తర్వాతి ఓవర్లో జడేజా బ్రాత్వైట్ను (0) వెనక్కి పంపాడు. 42వ ఓవర్లో షమీ.. కాట్రెల్(17; 18బంతుల్లో 2×4, 1×6), థామస్ (0)లను ఔట్ చేయడంతో విండీస్ ఇన్నింగ్స్ ముగిసింది.
విరాట్ షో:
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు ఆశించిన ఆరంభాన్నివ్వలేదు. తొలి ఓవర్ మూడో బంతికి ధావన్ (2) వికెట్ల ముందు దొరికిపోయాడు. తొలి ఓవర్లోనే క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. రెండో ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి జోరు కొనసాగించాడు. మరోవైపు రోహిత్ మాత్రం నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. దీంతో 10 ఓవర్లకు భారత్ స్కోరు 55. 16వ ఓవర్ వేసిన చేజ్.. రోహిత్ శర్మను ఔట్ చేసాడు. నాలుగో స్థానంలో వచ్చిన రిషబ్ పంత్ (20) కూడా ప్రభావం చూపలేకపోయాడు.
'నాలుగో స్థానం గురించి ఆలోచించడం లేదు.. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేస్తా'
శతక భాగస్వామ్యం:
శ్రేయస్ అయ్యర్ మాత్రం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కోహ్లీతో కలిసి అతను ఇన్నింగ్స్ నిర్మించాడు. ఈ క్రమంలో 38వ ఓవర్లో కోహ్లీ సెంచరీ చేసాడు. కాసేపటికే అయ్యర్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివర్లో విండీస్ బౌలర్లు చెలరేగడంతో.. కోహ్లీ, అయ్యర్ (71; 68బంతుల్లో 5×4, 1×6) పెవిలియన్ బాట పట్టారు. దీంతో నాలుగో వికెట్కు 125 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇన్నింగ్స్ చివరలో జాదవ్ (16), జడేజా (16 నాటౌట్) బ్యాట్ ఝళిపించలేకపోయారు. ఆఖరి 10 ఓవర్లలో భారత్ 67 పరుగులు చేయగలిగింది. బ్రాత్వైట్ మూడు వికెట్లు తీసాడు.