హాస్యాస్పద ఘటన:
మ్యాచ్ అనంతరం కివీస్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్, టీమిండియా మణికట్టు స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ మధ్య ఒక హాస్యాస్పద ఘటన చోటుచేసుకుంది. మైదానంలో గప్తిల్, రోహిత్ శర్మ ఏదో మాట్లాడుకుంటూ ఉండగా.. చహల్ వారి దగ్గరికి వెళ్లి ఏం జరుగుతోందని ప్రశ్నించాడు. చాహల్ను ఉద్దేశించి గప్తిల్ హిందీలో అనకూడని ఓ మాట అన్నాడు. దీంతో పక్కనే ఉన్న రోహిత్ నవ్వులు పూయించాడు. ఈ ఘటనంతా లైవ్లో రికార్డు అయింది.
టీమిండియా ఆటగాళ్లు పట్టించుకోలేదు:
అయితే మార్టిన్ గప్తిల్ తెలిసీ తెలియని భాషలో అలా అనడంతో అక్కడున్న టీమిండియా ఆటగాళ్లు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. వీడియో చూసిన క్రికెట్ అభిమానులు కూడా నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ఈ వీడియోను తెగ షేర్ చేస్తూ.. లైకులు, కామెంట్లు పెడుతున్నారు. షేర్ చేసిన కొద్ది గంటల్లోనే ఎంతోమంది వీక్షించారు. రెండో టీ20లో గప్తిల్ 333 పరుగులు చేయగా.. రోహిత్ 8 రన్స్ చేసాడు. ఇక చహల్ 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేదు.
|
భారత్ ఘన విజయం:
రెండో టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. మార్టిన్ గుప్తిల్ (33), కొలిన్ మన్రో (26), సీఫెర్ట్ (33 నాటౌట్) చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. భారత బౌలర్లలో జడేజా రెండు వికెట్లు సాధించాడు. అనంతరం టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 17.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కేఎల్ రాహుల్ (57), శ్రేయస్ అయ్యర్ (44) మ్యాచ్ను గెలిపించారు. దీంతో ఐదు టీ20ల సిరీస్లో టీమిండియా 2-0తో ఆధిక్యంలో ఉంది. మూడో మ్యాచ్ ఈ నెల 29న జరగనుంది.