మొదటిది సెంచరీ, రెండోది హాఫ్ సెంచరీ
వెస్టిండీస్తో ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్తో భారత్ జట్టులోకి అరంగేట్రం చేసిన ఓపెనర్ పృథ్వీ షా.. తొలి మ్యాచ్లోనే సెంచరీ, రెండో మ్యాచ్ హాఫ్ సెంచరీలతో మెరిపించాడు. తన దూకుడుకు టీమిండియాలో స్థానం దాదాపు పక్కా అయిపోయింది. అతనితో పాటు మరో ఓపెనర్గా ఆడుతున్న కేఎల్ రాహుల్ మాత్రం పేలవమైన ఫామ్తో సతమతమవుతున్నాడు. మరోవైపు మురళీ విజయ్ ఫామ్ కూడా ఆందోళనకరంగానే ఉంది.
ప్రాక్టీస్ మ్యాచ్లో పృథ్వీ షా కాలికి గాయం, తొలి టెస్టుకు డౌటే!!
పేలవ ఫామ్తో మురళీ విజయ్
ఇంగ్లాండ్ గడ్డపై ఆగస్టులో ముగిసిన టెస్టు సిరీస్లో మురళీ విజయ్ అవకాశం దొరికిన రెండు టెస్టుల్లోనూ పట్టుమని 10 ఓవర్లు కూడా క్రీజులో నిలవలేకపోయాడు. దీంతో.. రాహుల్, మురళీ విజయ్లో ఎవరికి అవకాశం ఇవ్వాలి..? అనే చర్చ జరుగుతున్న సమయంలోనే పృథ్వీ ప్రమాదం కొనితెచ్చుకున్నాడు. ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టుతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్లో భాగంగా మూడో రోజు ఫీల్డింగ్లో క్యాచ్ అందుకోబోయి కాలి చీలమండ మడత పడింది. దీంతో తొలి టెస్టుకు ఆడడంపైనే సందేహాలు నెలకొన్నాయి.
మీరైతే ఎవరెవరిని ఓపెనర్లుగా ఎంపిక
ఓ మీడియా సమావేశంలో ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్లో మీరైతే ఎవరెవరిని ఓపెనర్లుగా ఎంపిక చేస్తారు..? అని అడిగిన ప్రశ్నకు వీరేంద్ర సెహ్వాగ్ ఇలా బదులిచ్చాడు. ‘ఒకవేళ నేనే కెప్టెన్గా ఉండి ఉంటే..? కేఎల్ రాహుల్, పృథ్వీ షాలను సిరీస్ మొత్తం ఓపెనర్లుగా కొనసాగిస్తా. ఎందుకంటే.. మురళీ విజయ్ ఇటీవల భారత్ జట్టులోకి పునరాగమం చేశాడు. కాబట్టి.. అతను ఛాన్స్ కోసం వేచి ఉండాలి. '
కచ్చితంగా ఛాన్స్ దొరికినప్పుడు తమ ఫామ్ని
ఒకవేళ ఈ నాలుగు టెస్టుల సిరీస్లో ఎవరైనా ఒకరు విఫలమైతే మాత్రం ఆ అవకాశాన్ని మురళీ విజయ్కి అప్పగించాలి. నా అంచనా ప్రకారం క్రికెటర్లు ఎవరైతే.. ఇలా అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారో..? వారు కచ్చితంగా ఛాన్స్ దొరికినప్పుడు తమ ఫామ్ని నిరూపించుకుంటారు' అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.