రోహిత్ శర్మ తిరిగి అవకాశం
వెన్ను నొప్పితో రెండు టెస్టుకు దూరమైన రోహిత్ శర్మ తిరిగి అవకాశం దక్కించుకున్నాడు. దీంతో ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్-రోహిత్ శర్మ వస్తారా? లేక మయాంక్ అగర్వాల్, హనుమ విహారిలతో ఇన్నింగ్స్ ప్రారంభించి భారీ ప్రయోగం చేస్తారా అనే సందేహంలో పడేసింది బీసీసీఐ. ఈ మ్యాచ్తో మయాంక్ అగర్వాల్ అంతర్జాతీయ టెస్ట్ల్లో అరంగేట్రం చేయనున్నాడు. ఇక పేసర్ ఉమేశ్ యాదవ్కు కూడా ఉద్వాసన పలికిన జట్టు మేనేజ్మెంట్.. స్పిన్నర్ రవీంద్ర జడేజాకు అవకాశం కల్పించింది.
రాహుల్ రావడమంటే.. ఆసీస్, కివీస్ అభిమానులకు శుభవార్తే!!
1-1గా నిలిచి మూడో టెస్టు ఆధిక్యం కోసం
నాలుగు టెస్ట్ల సిరీస్లో భాగంగా ఇప్పటికే ఇరు జట్లు 1-1గా నిలిచి సమంగా దూసుకెళ్తున్నాయి. దీంతో ఇరు జట్లు మూడో టెస్ట్ విజయంపై దృష్టిసారించాయి. ఎలాగైన విజయం సాధించి సిరీస్లో పై చేయి సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాయి.
|
16మందితో కూడిన జట్టును ప్రకటించి
సోమవారం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో జరగనున్న పరిమిత ఓవర్ల ఫార్మాట్కు 16మందితో కూడిన జట్టును ప్రకటించింది బీసీసీఐ. మరో 24గంటల్లో మ్యాచ్ మొదలవుతుందనగా మూడో టెస్టుకు భారత తుది జట్టును ప్రకటించి అభిమానుల్లో ఉత్కంఠను నెలకొల్పింది.
|
భారత తుది జట్టు:
విరాట్ కోహ్లి (కెప్టెన్), అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, చతేశ్వర పుజారా, రోహిత్ శర్మ, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా