ఆఖరి రోజు అవాంతరంతో ముగిసిన మ్యాచ్
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్కు వరుణుడు పలుమార్లు అడ్డం పడ్డాడు. రెండు రోజుల నుంచి ఆటకి మధ్యలో అంతరాయం కలిగిస్తున్న వర్షం.. సోమవారం కూడా కొనసాగి మ్యాచ్ ఆడేందుకు వీలుకాలేదు. ఉదయం నుంచి సిడ్నీలో చిరుజల్లు కురుస్తుండటంతో.. మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. దీంతో.. అప్పటికే రెండు గంటలు ఆట సమయం వృథా అయిపోయింది. దీంతో తప్పని పరిస్థితుల్లో మ్యాచ్ను డ్రాగా ముగించారు. దీంతో నాలుగు టెస్టుల సిరీస్ని భారత్ 2-1తో చేజిక్కించుకుంది.
క్రికెటర్ కంటే ముందు.. అదే కావాలనుకున్నా: మయాంక్
కంగారూలని ఫాలో ఆన్ ఆడించిన కోహ్లీ
323 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా ఆదివారం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది ఆసీస్. అంతకంటే ముందు అదే రోజు ఓవర్నైట్ స్కోరు 236/6తో తొలి ఇన్నింగ్స్ని కొనసాగించడంతో కుల్దీప్ యాదవ్ (5/99) ధాటికి 300 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో.. 322 పరుగుల భారీ ఆధిక్యం భారత్కి లభించింది. కోహ్లీ అనూహ్య నిర్ణయం తీసుకుంటూ కంగారూల జట్టుని కెప్టెన్ కోహ్లీ ఫాలో ఆన్ ఆడించాడు. అయితే.. కొద్దిసేపటికే వెలుతురులేమి కారణంగా ఆదివారం ఆట నిలిచిపోయింది.
|
తొలి ఇన్నింగ్స్ని 622/7తో డిక్లేర్ చేసిన భారత్
అప్పటికి ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్లో 6/0తో నిలవగా.. క్రీజులో ఓపెనర్లు ఖవాజా (4 బ్యాటింగ్: 12 బంతుల్లో 1ఫోర్), హారిస్ (2 బ్యాటింగ్: 12 బంతుల్లో) ఉన్నారు. ఆ జట్టు ఓటమిని తప్పించుకోవాలంటే సోమవారం మొత్తం క్రీజులో నిలవాల్సి ఉండగా.. చివరి రోజు కాస్తా వర్షార్ఫణం అయింది. శుక్రవారం తొలి ఇన్నింగ్స్లో టీమిండియా బ్యాట్స్మెన్ చతేశ్వర్ పుజారా (193: 373 బంతుల్లో 22ఫోర్లు), రిషబ్ పంత్ (159 నాటౌట్: 189 బంతుల్లో 15ఫోర్లు, 1సిక్సు)సెంచరీలు బాదడంతో తొలి ఇన్నింగ్స్ని భారత్ 622/7తో డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే.
|
టెస్టు సిరీస్ విజయం ముగిసిందిలా
అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 31 పరుగుల తేడాతో, మెల్బౌర్న్ టెస్టులో 137 పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది. పెర్త్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియాపై 146 పరుగులతో ఆస్ట్రేలియా గెలుపొంది విజయం సాధించింది. ఇక ఆఖరిదైన సిడ్నీ టెస్టులో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా మ్యాచ్ డ్రాగా ముగిసింది. సిరీస్ మొత్తంలో 521 పరుగులతో ఛటేశ్వర్ పుజారా సిరీస్లో టాప్ స్కోరర్గా నిలువగా, అత్యధిక వికెట్లు బుమ్రా (21 వికెట్లు) పడగొట్టాడు. మహ్మద్ షమీ 16 వికెట్లు, ఇషాంత్ శర్మ 11 వికెట్లు తీశారు.