టెస్టుల్లో అత్యల్ప స్కోరు..
తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమిండియా మరీ ఘోరంగా విఫలమైంది. 4,9,2,0,4,0,8,4,0,4, 1.. ఇవి టీమిండియా ఆటగాళ్లు నమోదు చేసిన వరుస స్కోర్లు. పింక్ బాల్ స్టులో రెండో ఇన్నింగ్స్లో టీమిండియా బ్యాటింగ్ ఎలా సాగిందనడానికి ఈ పరుగులే నిదర్శనం. అసలు ఆడుతుంది అంతర్జాతీయ మ్యాచ్ లేక గల్లీ క్రికెట్ అనే అనుమానం కలిగింది. 31 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి టెస్టు చరిత్రలో అతి తక్కువ స్కోరు నమోదు చేసింది. టెస్టుల్లో తమ అత్యల్ప స్కోరు (42)ను తిరగరాసింది. టెస్టు చరిత్రలోనే 4వ అత్యల్ప స్కోరును సమం చేసింది.
హేజల్వుడ్ నిప్పులు:
శుక్రవారం చివరి సెషన్లోనే ఓపెనర్ పృథ్వీ షా (4) ఔటవగా.. నైట్ వాచ్మన్గా వచ్చిన జస్ప్రీత్ బుమ్రా (2: 17 బంతుల్లో) ఈరోజు ఆరంభంలోనే ఫాస్ట్ బౌలర్ కమిన్స్ బౌలింగ్లో అతనికే సులువైన క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత స్పీడ్ బౌలర్లు జోష్ హేజల్వుడ్, ప్యాట్ కమ్మిన్స్లు ఇండియన్ టాప్ ఆర్డర్ను దెబ్బతీశారు. నిప్పులు చెరిగే బంతులు వేస్తూ.. భారత బ్యాట్స్మెన్ను ఇబ్బందిపెట్టారు. దీంతో టెస్ట్ స్పెసలిస్ట్ చతేశ్వర్ పుజారా (0), కెప్టెన్ విరాట్ కోహ్లీ (4) వైస్ కెప్టెన్ అజింక్య రహానె (0)తో పాటు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (9: 40 బంతుల్లో 1x4) వరుస ఓవర్లలో క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు. దీంతో కీలక వికెట్లు కోల్పోయిన భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఆస్ట్రేలియా లక్ష్యం 90:
ఆపై ఆడుకుంటారనుకున్న వృద్ధిమాన్ సాహా (4), హనుమ విహారి (8) కూడా ఔట్ అవ్వడంతో భారత్ ఆశలు వదులుకుంది. అశ్విన్ (0), ఉమేష్ (4) కూడా అందరిని అనుసరించారు. చివరికి మహ్మద్ షమి(1) రిటైర్డ్ హర్ట్గా వెనుతిరగడంతో భారత ఇన్నింగ్స్కు తెరపడింది. మరోవైపు తొలి ఇన్నింగ్స్లో భారత్కు 53 పరుగుల ఆధిక్యం లభించడంతో ఆస్ట్రేలియా లక్ష్యం 90 పరుగులుగా నమోదైంది. హాజిల్వుడ్ 5/8, కమిన్స్ 4/21 నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడడంతో భారత బ్యాటింగ్ లైనప్ పేక మేడలా కూలింది. ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ నమోదు చేయలేదంటే కోహ్లీసేన ఎలా ఆడిందో అర్థమవుతుంది.
రెండో ఇన్నింగ్స్: చెలరేగిన కమిన్స్.. ఆరు వికెట్లు కోల్పోయిన భారత్!!