సఫారీ జట్టు ప్రదర్శనపై
దీంతో ఈ మెగా టోర్నీలో ఆ జట్టు సెమీఫైనల్కు చేరే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. అయితే, టోర్నీలో ప్రస్తుతం జట్టు ప్రదర్శనను చూసిన అభిమానులు ఏబీ డివిలియర్స్ ఉండి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
|
గతేడాది మే నెలలో డివిలియర్స్ వీడ్కోలు
గతేడాది మే నెలలో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఏబీ డివిలియర్స్ ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోన్న వరల్డ్కప్ కోసం దక్షిణాఫ్రికా జాతీయ జట్టులోకి రావాలని అనుకున్నాడు. ఈ విషయాన్ని గత ఏప్రిల్లో దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్, హెడ్ కోచ్ ఒట్టిస్ గిబ్సన్, సెలక్టర్ల కన్వీనర్ లిండా జోండిలను కలిసి మళ్లీ జట్టుకు ఆడాలని ఉందని తన మనుసులోని మాటను వెల్లడించాడు.
ఇంగ్లాండ్కు పయనమవ్వడానికి ముందు
వరల్డ్కప్ కోసం 15 మంది సభ్యుల బృందం ఇంగ్లాండ్కు పయనమవ్వడానికి ముందు 24 గంటల ముందే డివిలియర్స్ ఈ విషయాన్ని చెప్పినట్లు తాజాగా వెల్లడైంది. అయితే, డివిలియర్స్ అభ్యర్థనను జట్టు మేనేజ్మెంట్ ఎంత మాత్రం పరిగణనలోకి తీసుకోక పోవడం విశేషం. ఇందుకు గల కారణాన్ని కూడా వెల్లడించింది.
డివిలియర్స్ను మళ్లీ జట్టులోకి తీసుకుంటే
డివిలియర్స్ను మళ్లీ జట్టులోకి తీసుకుంటే అతడి స్థానంలో వచ్చిన ఆటగాళ్లతో పాటు జట్టులోని మిగతా క్రికెటర్లు సైతం అసహనానికి లోనవుతారన్న ఉద్దేశంతో జట్టు మేనేజ్మెంట్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకోవాలనుకున్నా దక్షిణాఫ్రికా బోర్డు మాత్రం డివిలియర్స్ ఆభ్యర్ధనను పరిగణనలోకి తీసుకోలేదు.
|
ట్విట్టర్లో డివిలియర్స్ ఇలా
మరోవైపు ఈ వార్తలపై ఏబీ డివిలియర్స్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. "వరల్డ్కప్ మన జట్టుకి మద్దతు తెలపడంపై మనమంతా శ్రద్ధ పెట్టాలి. ఇంకా టోర్నీలో ఆడాల్సిన మ్యాచ్లు చాలా ఉన్నాయి. మన బాయ్స్ పుంజుకుంటారని నేను నమ్ముతున్నాను" అని ఏబీ డివిలియర్స్ తన ట్విట్టర్లో ట్వీట్ చేశాడు.