మూడు నెలల రెస్ట్..
టీమిండియా టీ20 ప్రపంచకప్ ప్రణాళికల్లో ఉన్న అతను ఇప్పుడు గాయం కారణంగా దూరం కానున్నాడు. పక్కటెముకల గాయంతో బాధపడుతున్న హర్షల్.. మరో మూడు నెలల పాటు క్రికెట్కు దూరంగా ఉండాలని వైద్యులు సూచించినట్టు ప్రముఖ వెబ్సైట్ క్రిక్ బజ్ పేర్కొంది. ఈ కథనం ప్రకారం హర్షల్ పటేల్ ఆసియా కప్తో పాటు టీ20 ప్రపంచకప్కు (అక్టోబర్లో ప్రారంభం) కూడా అందుబాటులో ఉండే అవకాశం లేదు. అయితే హర్షల్ పటేల్ దూరమవ్వడంపై బీసీసీఐ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ వెస్టిండీస్ పర్యటన నుంచి తప్పిస్తున్నట్లు పేర్కొంది.
షమీని కాదని..
ఐపీఎల్ 2021లో 32 వికెట్లు తీసి, ఒకే సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా రికార్డు క్రియేట్ చేసిన హర్షల్ పటేల్, ఆ సీజన్ తర్వాత 31 ఏళ్ల వయసులో భారత జట్టు తరుపు అంతర్జాతీయ క్రికెట్లోకి ఆరంగ్రేటం చేశాడు. టీమిండియా తరుపున 17 మ్యాచులు ఆడి 23 వికెట్లు తీసిన హర్షల్ పటేల్, డెత్ ఓవర్లలో కట్టుదిట్టమైన బౌలింగ్తో మంచి పర్పామెన్స్ ఇస్తున్నాడు. దాంతోనే సీనియర్ పేసర్ మహ్మద్ షమీని టీ20లకు దూరంగా పెడుతూ, హర్షల్ పటేల్ని మూడో పేసర్గా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఆడించాలని టీమ్మేనేజ్మెంట్ భావించింది . కీలక సమయాల్లో బ్యాటుతోనూ రాణించగల హర్షల్ పటేల్, టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయమని అంతా అనుకున్నారు.
టీమిండియాకు గాయాల బెడద..
హర్షల్ పటేల్ గాయపడడంతో అర్ష్దీప్ సింగ్కు అవకాశం దక్కనుంది. ఒకవేళ దీపక్ చాహార్ ఆసియా కప్ టోర్నీలో రీఎంట్రీ ఇస్తే... టీమిండియా మూడో పేస్ బౌలర్ సమస్య తీరినట్టే. ఇప్పటికే కేఎల్ రాహుల్, దీపక్ చాహార్, కుల్దీప్ యాదవ్ వంటి కీ ప్లేయర్లు గాయాలతో కొన్ని నెలలుగా భారత జట్టుకి దూరంగా ఉన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ తరుచూ గాయపడుతూ జట్టుకి దూరమవుతున్నాడు... ఇప్పుడు ఈ లిస్టులో హర్షల్ పటేల్ కూడా చేరిపోయాడు...