ప్రధాన బౌలర్లు అనుకున్నట్లు రాణించలేక
‘వరల్డ్ కప్ సెమీస్కు అర్హత సాధించడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ప్రపంచ కప్ సాధించాలంటే ఇది సరిపోదు. జట్టుగా మరికొన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నాం. ముందు వాటిని అధిగమించాలి. సాధారణంగా టీ20 ఫార్మాట్లో ఒక్కోసారి ప్రధాన బౌలర్లు అనుకున్నట్లు రాణించలేరు. అలాంటి సమయంలో మరో బౌలర్పై ఆధారపడాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే ఐర్లాండ్తో మ్యాచ్లో నాతో పాటుగా, జెమ్మీ కూడా బౌలింగ్ చేశాం.' అని హర్మన్ వివరించింది.
హ్యాట్రిక్గా దూసుకెళ్లిన భారత్.. మరోసారి మిథాలీ దూకుడు
నుంచి జరిగే మ్యాచ్లన్నీ హోరాహోరీగానే
‘ఎలాంటి సందేహం లేకుండా ఇక నుంచి జరిగే మ్యాచ్లన్నీ హోరాహోరీగానే సాగుతాయి. కప్ గెలవాలంటే కచ్చితంగా దూకుడు పెంచాల్సిందే. ఐర్లాండ్తో అనుకున్న విధంగా బ్యాటింగ్ చేయలేకపోయాం. బౌలింగ్ విషయంలోనూ లోపాలున్నాయి. ఆ జట్టు బలహీనత వల్లే గెలిచాం. ఇక నుంచైనా అన్ని రంగాల్లో పూర్తిస్థాయి దృష్టి సారించి మరింత దూకుడు పెంచితేనే టైటిల్ సాధించగలం' అని హర్మన్ పేర్కొన్నారు.
మ్యాచ్లో గెలిచిన జట్టు గ్రూపు-బిలో అగ్రస్థానాన్ని
ఈ మ్యాచ్లో హర్మన్ 4 ఓవర్లు బౌలింగ్చేసి 10పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టింది. జెమీమా మాత్రం ఒకే ఓవర్ వేసి 6 పరుగులు ఇచ్చింది. శనివారం జరిగే తన చివరి లీగ్ మ్యాచ్లో భారత్, ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు గ్రూపు-బిలో అగ్రస్థానాన్ని దక్కించుకుంటుంది. ఆస్ట్రేలియాకు వ్యతిరేకంగా దూకుడుగానే ఉండాలి. గెలవాలంటే దూకుడును కొనసాగించాల్సిందే.
జట్టుగా మరింత దూకుడు పెంచాలని
2010 తర్వాత టీ20 ప్రపంచకప్లో సెమీస్కు వెళ్లడం భారత్కు ఇదే తొలిసారి. టోర్నీలో వరుసగా మూడో విజయం నమోదైనా.. మిగతా మ్యాచ్లను దృష్టిలో పెట్టుకొని జట్టుగా మరింత దూకుడు పెంచాలని కెప్టెన్ హర్మన్ప్రీత్ పిలుపునిచ్చారు.