ప్రేక్షకులకు అంపైర్ భయపడ్డాడు..
గ్వాలియర్(మధ్యప్రదేశ్) వేదికగా జరిగిన నాటి మ్యాచ్లో ఫీల్డ్ అంపైర్ ఇయాన్ గౌల్డ్ మ్యాచ్కు హాజరైన ప్రేక్షక సమూహాన్ని చూసి భయపడ్డాడని తెలిపాడు. దాంతో సచిన్ 190 ప్లస్ పరుగుల వద్ద ఉన్నప్పుడు తాను ఎల్బీడబ్ల్యూ చేశానని, కానీ అంపైర్ నాటౌట్ ఇచ్చాడని చెప్పుకొచ్చాడు. తనకు ఏమీ అర్థంకాక గౌల్డ్ వైపు చూశానని, అతడి మొఖంలో భయం కనపడిందని స్టెయిన్ చెప్పాడు.
హోటల్కు కూడా వెళ్లనివ్వరు..
‘నేనేమో.. ఇదేం నిర్ణయం.. అవుట్ అయ్యాడు కదా.. నాట్ ఔట్ ఎందుకిచ్చావు? అనే ఉద్దేశంతో అతడి వైపు చూశా. అంపైరేమో.. చుట్టూ జనాలను చూశావా.. సచిన్ను ఔట్ ఇస్తే ఇక్కడి నుంచి హోటల్కు కూడా నన్ను వెళ్లనివ్వరు.. అనేలా నా వైపు దీనంగా చూశాడు' అని స్టెయిన్ చెప్పుకొచ్చాడు. ఆ మ్యాచ్లో సచిన్ 147 బంతుల్లో 200 పరుగులతో నాటౌట్గా నిలవడంతో భారత్ 401 పరుగుల భారీ స్కోరును ప్రత్యర్థి ముందుంచింది. తరువాత ఛేజింగ్కు దిగిన సౌతాఫ్రికా 153 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.
అదే బెస్ట్ స్పెల్..
టెండూల్కర్ తన చివరి 51వ టెస్ట్ సెంచరీని కేప్టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో సాధించాడు. ముఖ్యంగా టెయిలండర్స్ సాయంతో స్టెయిన్ బౌలింగ్ను ఎదుర్కొంటూ ఈ శతకాన్ని అందుకున్నాడు. దీంతో ఇది తన కెరీర్లో ఎదుర్కొన్న బెస్ట్ స్పెల్ అని సచిన్ పలుమార్లు చెప్పుకొచ్చాడు. ఇక టెండూల్కర్ బౌలింగ్ ఎలా చేయాలో.. ముఖ్యంగా భారత ప్రేక్షకుల ముందు
అతన్ని ఎదుర్కున్న తీరును స్టెయిన్ వివరించాడు. ‘సచిన్ అద్భుత బ్యాట్స్మన్.. అతను చాలా అరుదుగా వికెట్ల ముందు దొరుకుతాడు'అని తెలిపాడు.
ఒక్క చెత్త బంతి వేసినా..
ఇక ఇంగ్లండ్ పేసర్ అండర్సన్ మాట్లాడుతూ.. సచిన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి తప్పు చేయవద్దని, ముఖ్యంగా బౌలింగ్ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నాడు. ‘ఒక్క చెత్త బంతిని కూడా సచిన్కు వేయకూడదు. ముఖ్యంగా భారత్లో అలాంటి తప్పిదం చేయవద్దు. ఆ ఒక్క బంతిని బౌండరీ తరలించే తన ఆటను మొదలు పెడతాడు. దాన్ని అలానే కొనసాగిస్తూ 500 పరుగులైనా చేస్తాడు. అప్పుడు ప్రపంచం మొత్తం ముగిసిపోతుందనే ఫీలింగ్ కలుగుతోంది. సానుకూల దృక్పథంతోనే బంతులు సంధించాలి'అని జిమ్మీ చెప్పుకొచ్చాడు.