
తమ్ముడు చనిపోయిన విషయం తెలియదు..
'ఇప్పుడు నా తమ్ముడు బతికి ఉంటే నాకంటే ఎక్కువ సంతోషించేవాడు. జనవరిలో నేను ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడడానికి వెళ్లినప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నేను ఇంటికి వచ్చే వరకు ఎవరూ ఈ విషయం చెప్పలేదు. టోర్నీలో ఆడుతున్నన్ని రోజులు రాహుల్ ఎక్కడున్నాడని ఇంట్లోవాళ్లను అడిగితే.. ఏదో పనిమీద బయటకు వెళ్లాడని సాకులు చెప్పేవాళ్లు. అతను చనిపోయాడనే విషయం కూడా తెలియనివ్వలేదు. ఇంటికి వెళ్లాకే అసలు విషయం తెలిసింది.
నా తమ్ముడు లేని లోటు పూడ్చలేనిది." అని చేతన్ కన్నిటీ పర్యంతమయ్యాడు. కరోనా నేపథ్యంలో కఠిన ఆంక్షల మధ్య సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ జరిగిన విషయం తెలిసిందే. తమ్ముడు చనిపోయిన విషయం చెబితే చేతన్ కెరీర్ దెబ్బతింటుందని భయపడ్డ అతని తల్లిదండ్రులు ఆ విషయం చెప్పుకుండా దాచారు.

గత సీజన్లోనే తెలుసు..
గత ఐపీఎల్ సీజన్లో ఈసారి సెలెక్టవుతాననే నమ్మకం తనకు ఏర్పడిందని చేతన్ తెలిపాడు. 'యూఏఈ వేదికగా జరిగిన గత సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు నెట్బౌలర్గా సేవలందించా. అక్కడ ఆ జట్టు కోచ్లు మైక్ హెసన్, సైమన్ కటిచ్ నాతో మాట్లాడారు. ఐపీఎల్లో ఏ జట్టుకైనా ఎంపికయ్యే అన్ని అర్హతలూ సాధించానని చెప్పారు.
దాంతో ఈసారి కచ్చితంగా ఏదో ఒక జట్టుకు ఎంపిక అవుతాననే నమ్మకంతో ఉన్నాను. నా కోసం వేలంలో ఆర్సీబీ కూడా ప్రయత్నించింది. కానీ రాజస్థాన్ దక్కించుకుంది. ఏ జట్టుకు ఆడినా నాకు సంతోషమే.'అని చేతన్ చెప్పుకొచ్చాడు.

ఇల్లు కొనుక్కుంటా..
ఇంత డబ్బు ఏం చేస్తావని చాలా మంది అడుగుతున్నారని, ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నట్లు ఈ లెఫ్టార్మ్ పేసర్ తెలిపాడు. 'మా నాన్న టెంపోవ్యాన్ డ్రైవర్. మాది చాలా పేద కుటుంబం. ఎంతలా అంటే గత ఐదేళ్ల కిందట మాకు కనీసం టీవీ కూడా లేదు. క్రికెట్ మ్యాచ్లు చూసేందుకు స్నేహితుల ఇంటికో.. లేక టెలివిజన్ షో రూమ్స్లనే చూసేవాడిని.
ఇప్పుడు ఇంత మొత్తం వచ్చేసరికి.. ఆ డబ్బుతో ఏం చేస్తావని అంతా అడుగుతున్నారు. తొలుత ఆ డబ్బు అయితే, రానివ్వండి. తర్వాత చూద్దాం' అని బదులిస్తున్నా. కానీ, ఒక మంచి ప్రదేశంలో సొంత ఇంట్లో ఉండాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఈ డబ్బుతో రాజ్కోట్లో ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నా'అని ఈ యువ క్రికెటర్ తన కోరికను వెల్లడించాడు.

అరంగేట్ర మ్యాచ్లోనే..
2018-19 రంజీ ట్రోఫీ సీజన్లో సౌరాష్ట్ర పేసర్ జయదేవ్ ఉనద్కత్ గాయపడటం వల్ల ఆ స్థానంలో చేతన్ రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. ఫస్ట్ మ్యాచ్లోనే ఐదు వికెట్లు సాధించాడు. ఇక ఆ సీజన్ మొత్తంలో సుమారు 30 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆపై బెంగాల్తో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్లో సౌరాష్ట్ర విజయంలోనూ చేతన్ కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ఐపీఎల్లో రాజస్థాన్ తరఫున ఎంపికయ్యాడు.


Click it and Unblock the Notifications












