అది బోర్డు నిర్ణయం..
‘ఐసీసీ ఛైర్మన్ పదవి గురించి నాకు తెలియదు. అది బోర్డు సభ్యులందరూ కలిసి తీసుకునే నిర్ణయం. అలాగే ఇప్పుడు ఐసీసీ నిబంధనలు కూడా మారాయి. ఒకవేళ ఎవరైనా ఆ పదవిలో కొనసాగాలంటే ఆ వ్యక్తి తన దేశం తరఫున బోర్డులోని పదవుల నుంచి తప్పుకోవాలి. ఇంతకుముందులా రెండు పదవులు చేపట్టే అవకాశం లేదు. అది బీసీసీఐ చేసిన మార్పు కాదు, ఐసీసీ చేసిందే. అయితే, ఇప్పుడున్న బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం.. ఇక్కడ పదవిలో ఉంటూనే ఐసీసీ లేదా ఏసీసీలో కొనసాగొచ్చు. కానీ, బీసీసీఐలో మాత్రం రెండు పదవులు చేపట్టకూడదు. అలాగే ఐసీసీ నిబంధనల ప్రకారం అక్కడా, ఇక్కడా రెండు పదవులు కలిగి ఉండొద్దు' అని గంగూలీ వివరించాడు.
మధ్యలో వదిలేయడం..
చివరగా ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను బీసీసీఐ నుంచి తప్పుకోవడం కూడా సరికాదని దాదా పేర్కొన్నాడు. 'భారత క్రికెట్ బోర్డును ఇలా మధ్యలో వదిలి వెళ్లడం, లేదా వెళ్లాల్సిన పరిస్థితులు రావడం సరైనవో కాదో నాకు తెలియదు. కానీ, ఐసీసీ ఛైర్మన్ పదవికి మాత్రం తొందరపడట్లేదు. అందుకు నేనింకా చిన్నవాడిని. అవి ఎంతో గౌరవప్రదమైన పదవులు. జీవితంలో ఒక్కసారే చేసే పనులు. ఇంతకుముందు ఆ పదవుల్లో కొనసాగిన గొప్ప పాలకులంతా ఒక్కొక్కసారే ఆయా బాధ్యతలు చేపట్టారు. క్రీడలకు సంబంధించినంత వరకు ఇతరుల కన్నా నాకు మరిన్ని ఎక్కువ విషయాలు తెలుసు. ఎందుకంటే నా జీవితమంతా ఆటతోనే ముడిపడి సాగింది. కాబట్టి, ఐసీసీ పదవిని చేపట్టాల్సి వస్తే అది బోర్డు సభ్యులందరి నిర్ణయం ప్రకారమే జరగుతుంది' అని దాదా స్పష్టం చేశాడు.
కరోనా వల్ల గడ్డు పరిస్థితులు..
ఇక దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో భారత క్రికెట్కు గడ్డు పరిస్థితులు నెలకొన్నాయని దాదా తెలిపాడు. తాను కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఎన్సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్తో ఎప్పటికప్పుడూ మాట్లాడుతున్నానని తెలిపాడు. వారంత పెరుగుతున్న కరోనా కేసులతో ఆందోళనకు గురువుతున్నారని తెలిపాడు. ఇక విరాట్ నివసిస్తున్న ముంబైలో పరిస్థితి మరి దారుణంగా ఉందన్నాడు. బోర్డులోని ప్రతీ ఒక్కరితో టచ్లో ఉంటూ భవిష్యత్తు ప్రణాళికలు రచిస్తున్నాం. కానీ ఎప్పుడు మొదలు పెడ్తామనే విషయాన్ని మాత్రం చెప్పలేనని దాదా తెలిపాడు.
అఫ్గాన్ ప్రపంచకప్ గెలిచిన తర్వాతే పెళ్లి చేసుకుంటా: రషీద్ ఖాన్